... మూడు బెత్తం దెబ్బలు

వంశీ కలుగోట్ల // ... మూడు బెత్తం దెబ్బలు //
***************************************
          ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చు అనగానే చాలామంది ఉలిక్కిపడ్డారు, మరికొంతమంది వెటకారాలు మొదలు పెట్టారు. ఇందులో చాలామంది గతంలో చంద్రబాబు అధికర మరియు అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నాడని, అన్నీ అమరావతిలోని పెడుతూ మళ్ళీ మిగతా ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నాడని అన్నవారే. జగన్ ముఖ్యమంత్రి కాకముందు హై కోర్ట్ కర్నూలుకు లేదా రాయలసీమలోని మరో ప్రాంతానికి (అనంతపూర్ వంటి వెనుకబడిన) ఇస్తే బావుంటుందని అలాగే తిరుపతి వంటి ప్రాంతాన్ని పాలిత కేంద్రంగా చేస్తే బావుంటుందని సూచనలు, సలహాలు ఇచ్చినవారే. ఇపుడు ఆ మేధావుల గత సూచనలకు తగినట్టుగానే అధికార మరియు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగబోయే సూచనలు కనబడుతుంటే ఈ  కావడం లేదు. 

- ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రానికే మూడు రాజధానులు అంటే మరి భారతదేశానికి 29 రాజధానులా అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయ్యా నాకు బట్టతల వచ్చింది కాబట్టి దువ్వెన అవసరం లేదు, అలాగని ఇంకెవ్వరికీ దువ్వెన అవసరం లేదని తీర్మానించేస్తే ఎలా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానితో పాటుగా సమగ్ర అభివృద్ధి, అన్ని ప్రాంతాల ఎదుగుదల అన్నవి అత్యంత ముఖ్యమైనవి. వాటిపట్ల దృష్టి సారించకుండా, చంద్రబాబు గారు అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా రూపొందిస్తానంటూ ప్రగల్భాలకు పోయి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. అలాగే ప్రతి కీలకమైన దానికి అమరావతి కేంద్రంగా ప్రకటించడం చేశారు. ఇపుడు వాస్తవిక కోణంలో జరుగుతున్న దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 
- శ్రీ బాగ్ ఒడంబడికను ఇన్నేళ్ళు గౌరవించని ఇన్ని ప్రభుత్వాలు చేయని పనిని, ఇపుడు ఈ ప్రభుత్వం చేస్తూ రాజధాని హోదాను కోల్పోయినా కర్నూలుకు హై కోర్ట్ ను ఇస్తే తప్పేంటి? రాయలసీమలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన అనంతపురం మరియు కర్నూలులకు మేలు జరిగే ఈ చర్యను విమర్శించడం అర్థం లేని పని. 1995 నుండి రాయలసీమ నాయకులే ముఖ్యమంత్రులుగా (రోశయ్య గారి పదవీకాలం మినహాయించి) ఉన్నప్పటికీ, రాయలసీమకు ఒరిగింది పెద్దగా ఏమీ లేదు (వైఎస్ హయాంలో కొంతవరకూ కడపలో జరిగిన వాటిని మినహాయించి). కర్నూలులో హై కోర్ట్ ఏర్పాటు అన్నది ఖచ్చితంగా రాయలసీమకు మేలు కలిగించేది మరియు కర్నూలుకు ఇన్నేళ్ళకు కొంతవరకూ కంటితుడుపు చర్య. 
- వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ కాపిటల్ అన్నది వైజాగ్ చుట్టుపక్కల ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం వంటి వెనుకబడిన ప్రాంతాలకు అత్యంత ప్రయోజనకారి కాగలదు. అసలు 2014 లో విడిపోయినపుడే ఇటువంటి ప్రతిపాదనలు కొందరు చేశారు కానీ 'అన్నీ నాకే తెలుసు' అనుకునే బాబుగారు ఎవరినీ పట్టించుకోలేదు. అంతెందుకు  నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రాధామ్యత వరుసలో ఏ ప్రాంతాన్ని కాక 'అమరావతి'ని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేశారు, అపుడు మాట్లాడని మేధావి నోళ్ళు ఇపుడు ప్రశ్నిస్తున్నాయి. 
- మూడు రాజధానులు అనగానే మూడు ప్రాంతాలలో అన్ని నిర్మాణాలు చేయరు అన్నది గమనించాలి. అధికార వికేంద్రీకరణలో భాగంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పరిపాలక కేంద్రం ఏర్పాటు అన్నది గమనించగలగాలి. ఈ ప్రకటన రాగానే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఎక్కడుంటారు అని అడగటం అర్థం లేని ప్రశ్న. టెక్నాలజీ పితామహుడిగా, నూతన సాంకేతికతను, మొబైల్స్ ను ప్రవేశపెట్టిన సాంకేతిక దార్శనిక నేతగా చెప్పుకునే ఆయన నుండి ఇటువంటి ప్రశ్న రావడం హాశ్చర్యకరం. అసెంబ్లీ సమావేశాలపుడు అమరావతి, మిగతా సమయంలో అధిక భాగం (అంటే పర్యటనలు వంటివి మినహాయించి) వైజాగ్ లో అన్నది ఆయనకు అర్థం కాలేదేమో. కర్నూలులో హై కోర్ట్ ఉంటుంది, అవసరం ఉన్నవారు అక్కడికెళతారు. 
- ఇక దూరం గురించి కర్నూలులో హై కోర్ట్ ఉంటే శ్రీకాకుళం నుండి ఎలా వెళతారు? వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉంటే కుర్నూలు, అనంతపూర్ లనుండి ఎలా వెళతారు? అంటూ కొందరు ప్రసినిస్తున్నారు. అయితే ఢిల్లీలో దేశ రాజధాని, సుప్రీం కోర్ట్ ఉంటే కన్యాకుమారి వంటి ప్రాంతాలనుండి ఎవరూ వెళ్ళట్లేదా? ఆయా కార్యాలయాలకు అవసరం ఉన్నవారు వెళతారు. 

... విమర్శిస్తున్న చాలామందిలో గమనించిన అంశం ఏంటంటే 'ఈ నిర్ణయం గురించి కాదు, నిర్ణయం తీసుకున్న వ్యక్తి పట్ల వ్యతిరేకత' ప్రధాన అంశంగా కనిపిస్తోంది.వ్యక్తి పట్ల ద్వేషం వల్ల మరియు వారికి నచ్చే వ్యక్తి వల్ల కానివి జరుగుతున్నాయని కడుపుమంటతో రగిలిపోతున్న వారికి ఈ మూడు రాజధానులు ప్రకటన 'మూడు బెత్తం దెబ్బలు' లాంటిది. బహుశా మరికొన్ని బెత్తం దెబ్బలు వెయిటింగ్ లో ఉన్నట్టున్నాయి ... 

Comments

  1. శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తి ఎప్పుడో గంగలో కలిసిపోయింది. రాయలసీమకు ఇప్పటికయినా ఎదో కాస్త మేలు జరిగితే అదే పది వేలు.

    మరోపక్క అన్ని హంగులు & వసతులు ఉన్న విశాఖపట్నం నగరాన్ని గాలికి వదిలేసి భ్రమరావతి గ్రాఫిక్కుల జిమ్మక్కులు ఎవరిని ఉద్దరించేందుకు? మూడు పంటలు పండే పచ్చని మాగాణాల్ని పాడు చేయొద్దని స్వర్గీయ పండలనేని శ్రీమన్నారాయణ ఎంత మొత్తుకొని చెప్పినా వారిని తూలనాడిన పాపం ఊరికే పోదు.

    ReplyDelete
    Replies
    1. ఏపాపమూ ఊరికే పోదండీ. నిలువునా తెలుగు గడ్డను చీల్చిన పాపంతో సహా.

      Delete
    2. తమిళులతో కలిసి ఉండుంటే కృష్ణ-పెన్నా లింకు ప్రాజెక్ట్ వచ్చేది. అనవసరంగా డెల్టా వారి మాయమాటల్లో పడి 1953లో సమైక్య మదరాసు రాష్ట్రాన్ని "చీల్చిన" పాపానికి రాయలసీమ ఇంకా ఎడారిగానే మిగిలింది. "మనందరిదీ ఒకే భాష కనుక కలిసుందాం" అని చిలుక పలుకులు పలికేవాడు అదే స్పూర్తితో నీళ్లు పంచుకోవడానికి తయారుగా లేడన్న తత్త్వం బోధపడితేనే సీమకు ఊరట.

      Delete
    3. గొప్పవారు గొట్టిముక్కల వారు. "సమైక్య మదరాసు రాష్ట్రాన్ని "చీల్చిన" పాపం" అంటున్నారు! తెలుగువారు తమకో రాష్ట్రం భాషాప్రాతిపదికను కావాలనుకోవటం పాపం అని సిధ్ధాంతం చేస్తున్నారు. ఆ నోటితోనేనే తెలంగాణావాదాన్ని సమర్ధిస్తూ గీతాలాపనలు చేసారు. ఆత్మగౌరవం అంటే అది కేవలం తెలంగాణావాళ్ళకే ఉంటుందన్న మాట. సెబాసు. సెబాసు. "ఆంద్రుల్ని పాపాత్ములు అనే అవకాశం" వదులుకోకూడదని నోటికి ఎలావస్తే అలా మాట్లాడతారా మీరు. ఇంకొంచెం ముందుకు పోయి బంగారం లాంటి బ్రిటుషు సామ్రాజ్యం నుండి విడిపోయిన పాపం భారతీయులదీ, లేకపోతే నిజాం రాజ్యం ఇంకా ఇప్పటికీ ఎంతో పచ్చగా ఉండేదీ అని పబ్లీకుగా వాపోతారా? కొంచెం వినాలని ఉంది, మీ నోరెంత దూరం సాగుతుందో అని.

      Delete
    4. వాఖ్య చుడండి మాస్టారూ, సమైక్య రాష్ట్రాన్ని చీల్చకపోతే కృష్ణ-పెన్నా లింకు వచ్చేది. మీకు సాగు నీరు కంటే ఆత్మగౌరవం గట్రా పెద్ద మాటలు ముఖ్యమునుకుంటే డెల్టా & సాగర్ కుడికాలువ ఖరీఫ్ మానేసి ఆ నీళ్లు రాయలసీమకు ఇచ్చేందుకు తయారా?

      Delete
    5. జై - విపరీత వాదన చేయవద్దు. తెలుగు వారికి రాష్ట్రంకోసం చేసిన పోరాటాన్ని వక్రీకరించ వద్దు. హుందాగా నీ వాక్య వెనక్కు తీసుకో. మద్రాసు నుండి విడిగా ఆంధ్ర ఏర్పాటు ఒక గొప్ప చారిత్రక విశేషం.

      తెలంగాణా ఆంధ్ర నుండి విడి పోవడం ఒక చారిత్రక తప్పిదం అని ఒక తెలుగువాడిగా నేను భావిస్తున్నాను.
      అయినా పరవా లేదు. అది ముగిసిన అధ్యాయం.

      నీకు ఎంతో విషయ పరిగ్నానం ఉంది. కానీ ఏమి లాభం. సంకుచితంగా వాదిస్తావు.

      పౌరసత్వ బిల్లును తెరాస వ్యతిరేకంగా ఓటు వేయడం ఎలా సమర్థించు కుంటావు. తెలంగాణా విమోచన దినం ఒవైసీ కి భయపడి జరుపుకోలేక పోవడం గురించి ఏమి చెబుతావు జై.

      నిజాం పాలన లో జరిగిన అరాచకాల గురించి మాట్లాడే ధైర్యం ఉందా. ఎంత సేపు సాటి తెలుగు వాళ్ళను వెక్కిరిస్తావు.

      కేసీ ఆర్ చేపట్టిన మంచి పనులు ఎన్నో వున్నాయి. (ఉదా. యాదాద్రి, కాళేశ్వరం, భగీరథ...) అందరూ ఒప్పు కుంటారు. కానీ

      ఆర్టీసి సమ్మె విషయంలో చర్యలు ఎంత అవక తవక గా ఉందో చెప్పావా.

      నిక్షేపం లాంటి సచివాలయ భవనాలను కూల్చి కొత్తవి కట్టడం గురించి చెప్పావా.

      Delete
    6. What happened was over, and now lets look at what best can be done from our point of view. Personally speaking, I support formation of Andhra Pradesh and oppose bifurcation with Telangana. But, that's over. Here in this article what I tried to say was proposed three capitals for AP would do good for both Rayalaseema and Uttarandhra areas. Let't not deviate from the main topic, let history be like that as we can't change it.

      Delete
    7. టపా విషయం తెలంగాణా లేదా పౌరసత్వ సవరణ చట్టం కాదు.

      మదరాసు రాష్ట్రాన్ని విడగ్గొట్టి ఆంద్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం మంచో కాదో మీ అభిప్రాయం మీది. శ్రీబాగ్ ఒడంబడిక కనీసప్రాయంగానయినా అమలు కాకపోవడం మూలాన సదరు విభజన రాయలసీమకు తీరని తీవ్ర విధ్వంసం జరిగిందనే నా అంచనా మాత్రం మారదు.

      జరిగిందేదో జరిగింది, ఇంకా నష్టం జరగకూడదు, సీమ విధ్వంసం ఇక్కడితో ఆగాలి. హైకోర్టే కాదు, సాగు నీరు ప్రాజెక్టులు *నికర* జలాలతో తడిపితే నెర్రలు చీలిన నేలకు ఊరట.

      కరువు సీమ కష్టాలు ఎరిగిన జననేత జగన్ పుట్టిన గడ్డం ఋణం తీసుకుంటారని ఆశిస్తాను.

      Delete
  2. Totally agree with you vamshi garu. Decentralising administration is the right step. Let Amaravati be the legislative capital. I totally support Jagan for this move. Chamba and Paka have to do some soul searching.

    ReplyDelete
  3. దిక్కుమాలిన రాష్ట్రానికి రాజధాని ఉంటే ఏమిటి? లేకపొతే ఏమిటి?

    ReplyDelete
    Replies
    1. ఇకో 4న్నర ఏళ్ళు ఆగితే.. మా బాబోరో.. వారి పుత్ర రత్నమో.. మాకు పెద్దిక్కుగా ఒచ్చేస్తారు. అప్పుడుగదా రాష్ట్రానికి రాజధాని గురించి ఆలోచించాల్సింది..

      Delete
    2. @ananymous garu మీ దిక్కుమాలిన వ్యాఖ్యకూ ఇంతకుమించి స్పందించాల్సిన అవసరం లేదేమో 

      Delete
    3. ప్రత్యేక హోదా ఇవ్వలేదు.
      పేకేజి ఏమయిందో తెలీదు.
      ఆర్ధిక లోటు పూర్తిగా ఇవ్వలేదు.
      రాజధానికి నిధులు ఇవ్వలేదు.
      విభజన హామీలు పూర్తి చెయ్యలేదు.
      ఇక దిక్కుమాలిన రాష్ట్రం కాక ఏమవుతుంది?

      Delete
    4. సర్ రాజకీయాలు ఎపుడూ ఉండేవే, అవన్నీ ఇపుడు కాకపొతే మరి కొన్నాళ్ళకు సాధింపబడతాయి. రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద ఉన్న ద్వేషాన్ని రాష్ట్రానికి ఆపాదించకండి. మా రాష్ట్రం గొప్పది కాకపోవచ్చు, భూతల స్వర్గం కాకపోవచ్చు కానీ దిక్కుమాలినది కాదు. స్వస్తి

      Delete
    5. ఆంధ్రరాష్ట్రం దిక్కుమాలినది కాదు. ఎంతమాత్రం కాదు. కాని దిక్కుమాలిన రాజకీయనేతలున్న రాష్ట్రం. దిక్కుమాలిన అన్యాయాలకూ. అసమానతలకూ అవమానాలకూ, నిష్ఠూరాలకూ, నిందలకూ, హేళనలకూ నిత్యమూ గురి అవుతున్న రాష్టం. వీటికి తోడు దిక్కుమాలిన మేతావుల ప్రేలాపనలకూ వారి దిష్ట్తికీ కూడా గురి అవుతున్న రాష్ట్రం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న సత్యం స్పృహలో లేని దిక్కుమాలిన మనుషులకు బుధ్ది చెప్పే రోజుకోసం కాచుకొని వేచి ఉన్న రాష్ట్రం కూడా ఆంధ్రరాష్ట్రమే.

      Delete
    6. అనేక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రరాష్ట్రం ఇంకా చాలా మెరుగ్గానే ఉందండి. ఆంధ్రరాష్ట్రంలో రాజకీయ నేతలు కూడా అనేక ఇతర దిక్కుమాలిన నేతలకన్నా కాస్త బెటర్ గానే ఉన్నారు అని చెప్పవచ్చు.

      Delete
    7. "బుధ్ది చెప్పే రోజుకోసం కాచుకొని వేచి ఉన్న రాష్ట్రం"

      ఆరు నెలల కింద బుద్ధి చెప్పింది ప్రస్తుతానికి సరిపోయింది లెండి. ఇంకో ఐదేళ్లు పోయాక ఈ 23 కూడా మిగల్చకుండా ఇంకాస్త వాత పెట్టొచ్చు, అప్పటి వరకు ఓపిక పట్టండి.

      Delete
    8. గొట్టిముక్కల గారికి ఏమర్ధం ఐనదో, ఏపాటిగా అర్ధం ఐనదో పాపం. అనంతమైన కాలగమనంలో వెనుకముందులుగా ఐదేళ్ళో నిజానికి యాభైయేళ్ళో ఐనా ఒక లెక్క కాదు కదా. వాపును బలుపుగా భ్రమపడే వారికి ఏమి చెప్పినా ఎక్కదు. పోనీ వారన్నట్లే ఆ ఇరవై మూడు మిగల్చకుండా నుటికి నూరు సీట్లూ ఇస్తే మరింతగా తెలంగాణాకు బానిసల్లా ఆంధ్రాప్రభుత్వం వారు పడుంటారు కదా అని వారి ఆశ అని తెలుస్తూనే ఉంది. వారు అలాంటి భవిష్యత్తును కోరి చూస్తూ ఉంటే కాలం మరొకలాంటి భవిష్యత్తును మోసుకొని వస్తుందేమో పాపం. పోనివ్వండి పాపం పండే రోజు వచ్చినప్పుడు ముచ్చట్లు వేరుగా ఉంటాయి మరి

      Delete
    9. బానిసగా బతకలేడనే.. పప్పుని మందలగిరి పొలిమేరల్లోకికూడా రాకుండా తరిమికొట్టారంటావా??

      Delete
  4. వంశీ కలుగొట్ల గారు క్షమించగలరు - వేరే చోట రిఫరెన్స్ లు ఇక్కడకు తెచ్చి quote చేసి వ్యాఖ్యానించినందులకు. ఇదీ ప్రపంచం బ్లాగ్లో "త్రికేంద్రీకరణ..త్రిఫలచూర్ణమా..త్రీ కేపిటల్ ప్లాన్‌తో జగన్ సెన్సేషన్" పోస్ట్ లోనూ ఇక్కడా జరుగుతున్న చర్చలకు మూలం ఒక్కటే గనుకానూ, పాత్రధారులు కూడా ఒక్కటే అవడంతోనూ, నాకక్కడ వ్యాఖ్యానించే అవకాశం లేకపోవడంతోనూ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. మన్నించగలరు.

    తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమేమంటే గొట్టిముక్కల గారు కెసిఆర్ గారు నిజాం పాలన కాలంలో లేక పోవడమే. వీళ్ళే గనుక ఉండి ఉంటే పటేల్ గారు తోక ముడిచి పారిపోయేవారు. వీళ్ళు ఎంచక్కా పాకిస్తాన్ లో కలిసిపోయి సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లేవారు, ఇప్పుడు పాకిస్తాన్వారున్నట్లుగానే. వీళ్ళకి నిజాం వారసులమని చెప్పుకోవడం ఆపై Apna biryani aur sherwani duniya mein hamesha se mashoor tha, yeh baat nakko bhoolo yaron అని హిందీలోనో ఉర్దూలోనో కులుకుతూ తెలుగోడిగా పొంగిపోవడం గర్వంతో కూడిన విజ్ఞత. అదే వాళ్ళ నాగరికత. తెలుగు వాళ్లమని ఒప్పుకోక తప్పని పరిస్థితిని గర్హిస్తూ ,ఆక్రోశిస్తూ, తెలుగు తల్లా ఎవరావిడ (ఇంత గౌరవంగా కూడా సంబోధించిన గుర్తు నాకు లేదు) అని గర్జిస్తారు. ట్యాంకుబండ్ పై ఉన్న తెలుగు జాతి మహామహుల విగ్రహాలను, కేవలం తెలుగు వాళ్లన్న ఒకే ఒక్క కారణంతో, ముష్కరుల్లా ఛిద్రం చేస్తారు.
    "నైజాం కాలంలోనే అభివృద్ధి చెందిన ఇంఫ్రాస్ట్రక్చర్, రవాణా సౌకర్యాలు, విద్యావైద్య వసతులు" అని గప్పాలు కొట్టుకుంటారు కానీ ఆంధ్ర ప్రాంతం నుచి వలసలు సాగిన తర్వాతే ఆ ప్రాంతం వాళ్లు చదువుల ఆవశ్యకతను తెలుసుకున్నారని, చైతన్యవంతులయ్యారనీ ఒప్పుకోరు. "ఎవరినయినా సొంతం చేసుకోగలిగిన మిశ్రమ కాస్మోపాలిటన్ సంస్కృతి" - దీనికి పూర్వాశ్రమమేంటి? ఆ స్టేజి ఎలా ఒచ్చింది-దీన్లో ఆంధ్రావాళ్ల పాత్ర ఏమీ లేదా?
    అంతా మీరే కష్టపడి స్వయంగా సాధించారా? అసలు ఒక్కసారైనా గుడ్ సైడ్ ఆలోచించరా! తప్పొప్పులు అన్ని చోట్లా, అన్ని విషయాల్లో, ఎల్లవేళలా జరుగుతూనే ఉంటాయి. అంతమాత్రాన జరిగిన మంచి, చేసిన వాళ్ళు మరుగున పడిపోతారా? ఆంగ్లేయుల పాలనలో మనం కష్టనష్టాలనెదుర్కొన్నా ఎంతో కొంత మంచి కూడా జరిగిందన్న విషయం జైగారు ఒప్పుకునే పక్షంలో - ఆంధ్ర వాళ్ళ పాలనలో కూడా తెలంగాణా వాళ్ళు ఎన్నో కొన్ని కష్టనష్టాలనెదుర్కొన్నా ఎంతో కొంత మంచి కూడా జరిగిందన్న విషయం ఒప్పుకోవడానికి శ్రీ జైగారికి ఎందుకనో పాపం ఎప్పటికీ గొంతులో పచ్చి వెలక్కాయే. జక్కన్న కూడా చెక్కలేని శిలలు కొన్ని ఉంటాయి. పాపం జైగారు ఆ బాపతే.

    నేనెప్పుడూ వ్యక్తిగతంగా ఒకటి తలపోస్తుంటాను - ప్రపంచ దేశాల్లో ఎక్కడికెళ్లినా ఇండియా అన్నా, ఇండియన్స్ అన్నా అతి చిన్న చూపు అని. అదే దేశం విషయానికొస్తే తెలుగు వాళ్ళన్నా (ఒకప్పుడు ఏపీ, ఇప్పటి ఏపీ తెలంగాణ కలిపి-కలగలిపి) మన రాష్ట్రాలన్నా దారుణమైన చిన్నచూపు. కారణం ఏమిటంటే మన తెలుగోడి మైండ్సెట్. కరెక్ట్ గా అనలైజ్ చెయ్యగల్గితే - అచ్చం శ్రీ జైగొట్టిముక్కల గారి మైండ్సెటే. పీతల బుట్ట మైండ్సెట్. మన కంపు మనకింపు పర కంపు పరమ కంపు - అంతేనా శ్రీ జగొట్టిముక్కల గారూ ?

    ReplyDelete
    Replies
    1. తమరు ఏయే దేశాలకు వేంచేసారో తెలీదు. నేను తిరిగిన అనేకానేక దేశాలలో భారతీయులంటే గౌరవమే తప్ప చిన్న చూపు ఎక్కడా అగుపించలేదు. అట్లాగే మన దేశంలో కూడా ఎక్కడా దక్షిణాది మనుషులన్నా, తెలుగు వారన్నా, హైదరాబాదీలన్నా చులకన భావం ఎదురుకోలేదు.

      As you (for a change rightly) say, it depends on mindset. మీకు ఇతరులంటే పడదు కనుక వాళ్ళు మిమ్మల్ని గేలి చేస్తున్నారని ఊహించుకునే అనుమాన ప్రవృత్తి వదిలేస్తే శ్రేయస్కరం.

      తెలంగాణా, రాయలసీమ, రాజస్థాన్, గుజరాత్ ఎవరయినా ఒక్కటే. నేనే గొప్పంటే ఎవరూ పడరు, మీరూ నేనూ అందరమూ మన మేరకు మనం మంచంటే అందరూ ఏకీభవిస్తారు.

      Delete
    2. ఇంత మంచిగా అనాలిసిస్ చేయగలిగిన అనానిమస్ గారూ! మీ పేరెందుకు చెప్పుకోరూ?

      Delete
    3. అంతా బాగానే చెప్పారుగానీ, అదంతా మీకుగూడా వర్తిస్తుందికదా? మీ దృష్టిలో, ఆంధ్రా నాయకత్వం అంటే, నాచబానా మాత్రమేనా?? రాజధాని అంటే, నాచబానా/చినబాబు కడితేనేనా? మూడు రాజధానుల్లో వ్యతిరేకత అంత ఇన్స్టాంట్ గా ఎలా పుట్టీంది? కనీసం దానిగురించీ, పర్యవసానాలగురించీ 1 నిమిషమైనా చర్చించారా? "మాకు అభివృధ్ధి వికేంద్రీకరణ జరగాలి గానీ అధికార వికేంద్రీకరణకాదూ" అంటూ సన్నాసి మాటలేంటి? మూడు రాజధానులైతే, అభివృధ్ధి ఆగిపోద్దని ఎవరు చెప్పారు మీకు? అలాంటి మాటలనే వార్ని తీసుకెల్లి పిచ్చాసుపత్రిలో పెట్టాలి. రాజధాని అమరావతినుంచి ఎత్తేస్తున్నాం అని చెప్పలేదే.. ఒకవేళ అదే జరిగినా.. అల్రెడీ భూములు అమ్మేసిన(త్యాగం చేసేసిన) రైతులకొచ్చే నష్టం ఏమిటి?

      Delete
    4. @jjjj
      ఇంత మంచిగా అనాలిసిస్ చేయగలిగిన అనానిమస్ గారూ! మీ పేరెందుకు చెప్పుకోరూ?
      hari.S.babu
      తమరిదీ అసలు పేరు కాదు కదా?ముఖపుస్తకంలో కనిపిస్తున్న "అల్లాని ఉంచుకున్న మేరీ" తరహా ముసుగు పేరే కదా మీది కూడాను.తమరి అసలు పేరు, వూరు, ప్రాంతం, చదువు, సంస్కారం కూడా ఎవరికీ తెలియవు కదా, మీరెందుకు బయట పదటం లేదూ!

      Delete
    5. This comment has been removed by a blog administrator.

      Delete
    6. This comment has been removed by a blog administrator.

      Delete
    7. To all - lets not do personal attacks, lets restrict to the topic. We may oppose or support but that's all about one issue - that's all and let's stop there. Thanks

      Delete
    8. I have removed few comments as they are targeting few individuals with very bad language, actually they were published without checking as I was little busy and did not check them. And, few more comments were posted but I did not publish them as they also targeting me and few other individuals. I request all of you who are responding not to target individuals and not to use bad language. Thanks for understanding

      Delete
  5. భూమిని అమ్మారని నీకెవడు చెప్పాడు. అవగాహన లేకుండా అసందర్భ ప్రేలాపనలెందుకు

    ReplyDelete
    Replies
    1. మీ దృష్టిలో బాండ్లు, కంపన్షేషన్లు, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు, దీనికితోడు కొంత లాండు తీసుకోని త్యాగం చేశారు రైతులు... అదికూడా.. చందమామలాంటీ నాచబానా మొఖం చూసి అంటే సరే మరి. ఆ త్యాగధనుల విషయం పక్కనబెట్టి, మిగితా విషయాల మాటే లేదేమి? విషయం లేకనా? ఇలా అని నా మీద జగన్ అభిమాని ముద్రేసేరు.. పిచ్చ కుల అభిమానం లేదంతే...

      Delete
  6. చిరు డ్రీమ్స్ గారు నా వ్యాఖ్యలో నేను కేవలం ఆంధ్రా వాళ్ళ పాత్ర, ఆంధ్రా వారి పాలన అని మాత్రమే అన్నాను. నేనెక్కడా నాచబానాను వెనకేసుకొచ్చిన పోలిక వాడలేదు. రంగమార్తాండ చినబాబు రంగ ప్రవేశమే పెదబాబు దశ తిరగడానికి ప్రధాన కారణం. దరిమిలా జరిగిన అధికార వికేంద్రీకరణ మూలంగానే పాలన గాడి తప్పి తెలుగు దేశానికి శాపమైంది. రాష్ట్రమంతా ఈ సారి టీడీపీ గెలవడం కష్టం అని కోడై కూస్తుంటే, పెదబాబు గారు, ఇంటలిజెన్స్ విభాగాలు కనీసం వాసన పట్టలేకపోవడం ఆశ్చర్యకరం. సగటు మనిషి పసిగట్టిన విషయాన్ని చెప్పుకున్నంత అనుభవమున్న మహానాయకుడు కనిపెట్టలేకపోవడం పెదబాబు చినబాబు ల మధ్య పెద్ద తేడా లేదా అన్న అనుమానం కలిగిస్తుంది. అది కాక ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ప్రతిపక్షం అలుపెరగకుండా ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంటే, సరిదిద్దుకోవాల్సింది పోయి ఎదిరి పక్షంపై, చేతలతో బదులు మాటలతో త్రిప్పికొట్టడానికి క్రెడిబిలిటీ లేని బుద్దా వెంకన్న, బాబూ రాజేంద్ర ప్రసాద్ లాంటి వారిని పార్టీ మౌత్ పీస్ లు గా ముందు పెట్టుకుని, పార్టీ తన క్రెడిబిలిటీ కి తానే తూట్లు పొడుచుకుంది. అలానే ఆలోచన లేని పీకే అధికార పక్షాన్ని విమర్శించడానికి బదులు ప్రతిపక్షాన్ని విమర్శించడంలో కాలం గడపడంతో, గోదావరి జిల్లాల్లో పెల్లుబికిన మద్దతును చేతులారా కోల్పోయి పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసాడు. అలా కాకుండా తన మంగళగిరి మీటింగ్ స్టాండ్ ని గనుక కొనసాగించి టీడీపీని దూరం పెట్టి ఉంటే, తాను ఖచ్చితంగా ప్రతిపక్ష స్థానంలో ఉండి ఉండేవాడు - కనీసం 30 - 40 సీట్లతో. బహుశా అధికార పక్షాన్ని కాకుండా ప్రతిపక్షాన్ని ఎదుర్కొనడానికి పుట్టిన ఏకైక పార్టీ ప్రపంచంలో ఇదొక్కటే అయి ఉంటుంది.
    మూడు రాజధానులన్న విషయంలో నాకు విరోధమేమీ లేదు. కానీ it should have been chalked out in a more prolific way, with much debate and people's approval, rather than leaving a doubt in people's mind that somewhere, something isn't correct. గతంలో తాను సమర్ధించి ఇప్పుడు ఇలా చేయడం కూడా సరైన చర్య కాదు. కమిటీల తతంగం, విశ్వసనీయత మనకు తెలియనిది కాదు. అవి కేవలం ప్రభుత్వం మనసులోని మాటను పేపర్ పైన పెట్టే సాధనాలు మాత్రమే. అలాగే ఆల్రెడీ భూములమ్ముకున్న వాళ్ళకొచ్చిన నష్టమేమీ లేదు గానీ, ఉన్న వాళ్లకు మాత్రం ధరాఘాతమే! అడిగే వాడు, కొనేవాడు లేడు. రెండు కోట్లు పలికిన భూమి ఇప్పుడు అతి కష్టంమీద ఓ 60 లక్షలు పలుకుతోంది. సారీ 60 లక్షలు కూడా పలకడం లేడు. కొనేవాడు దుర్భిణీ వేసినా నెల్లూరంత దూరంలో కూడా కనబట్టం లేడు. అక్కడి వాళ్లకు అది ఖచ్చితంగా లాసే.

    ReplyDelete
    Replies
    1. >>it should have been chalked out in a more prolific way, with much debate and people's approval, rather than leaving a doubt in people's mind that somewhere, something isn't correct.

      Agree with you

      Delete
    2. >>అక్కడి వాళ్లకు అది ఖచ్చితంగా లాసే
      Correction. For real estate brokers only..

      Delete
    3. అనానిమస్ గారు తన నిషితమయిన విశ్లేషణ సొంత పేరుతోనే చేసుండుంటే బాగుండేదన్న చిరు గారితో పూర్తిగా ఏకీభవిస్తాను. Anyhow, thanks for the excellent debate sir.

      తుళ్ల్లూరు తదితర గ్రామాలలో లాండ్ పూలింగ్ భాగస్వాములైన వారి ఆదుర్దా అర్ధం చేసుకోగలం. కాకపొతే సదరు భూముల వెల నిజవిలువకు పడిందే తప్ప తీవ్రనష్టం ఏమీ లేదు. భ్రమరావతి పేరుతో నడిమంత్రపు సిరుల జాక్పాట్ కొట్టొచ్చన్న "కల్లలు" నెరవేరలేదు అంతే.

      నేలను నమ్ముకుంటే ఫలితం వస్తుంది కానీ స్పెక్యులేషన్ మోజులో రియల్ దందాల కోసం భూమి అమ్ముకుంటే వచ్చే సాధకబాధకాలు ఎవరికి వారే భరించాలి. Speculation is inherently risky, no one can guarantee windfalls.

      Delete
    4. ఆహా బాగుంది జై. రైతులు మీ పుణ్యమా అని జూదరులని తేలింది. బాగుంది. ఒకరోజున హైదరాబాద్ పరిస్థితి ఇంతే అవుతుంది. అప్పుడు మిగిలిన దేశం అంతా హైదరాబాదీ లంతా జూదగాళ్ళు అనవలసిందే కదా. తప్పక అంటారు లేండి

      Delete
    5. పట్నంలో ఏసీ బంగళాలు కట్టుకొని, పున్నమికో అమావాస్యకో బెంజ్ కారులో దర్జాగా వెనుక సీట్లో కూచొని షైరుకు వెళ్లినట్టు కాస్సేపు పొలానికి వచ్చి పాలేర్లను ఆజమాయిషీ చేసి, ఏడాదికో రెండు సార్లు పిల్లల దగ్గరికి అమెరికా యాత్రలు చేసేవారిని రైతులు కాదు, మోతబరులు అంటారు.

      ఎకరానికి లక్షలు చేసే భూములిచ్చి కోట్లు కొట్టేయాలని పగటి కలలు కనేవాడు ఎన్నటికీ జూదరే. వళ్ళు వంచి పని చేసే బక్క రైతు తన కష్టాన్ని నమ్ముకుంటాడే తప్ప గొంతెమ్మ కోరికలు కోరడు.

      లక్షలాది రూపాయిలు విలువ చేసే ఐఫోన్ & ఆపిల్ వాచీలు వేసుకున్న "రైతుల" నిరసన చూస్తే కడుపుబ్బనవ్వొస్తుంది తప్ప సానుభూతి కలుగదు.

      Delete
  7. చాల్చాలు జై. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడారు.
    నిమ్స్ లో దర్జాగా సెలైన్ ఎక్కించుకుంటూ (బహుశః పళ్ళూ ఫలహారాలూ కూడా హాయిగా లాగిస్తూ) నిరాహారదీక్ష చేసిన వాడిని గురించి కాని, ఉద్యమం పేరుతో, అదీ అహింసా ఉద్యమం అటూనే బోలెడంత హింసకు పాల్పడుతూ - ఆత్మాహుతుల పేర బహుశా బలి రాజకీయాలు చేస్తూ, తన అదృష్టం బాగుండి తెలుగుగడ్డను పగలేసిన పెద్దమనిషి గురించి మీరు తెలిసి కూడా (మీకు తెలియదని అనుకోవటం కుదరద్య కాబట్టి) ఎన్నడూ ఒక్క నిష్ఠూరం ముక్కా పలికిన దాఖలాలు లేవు. కాని ఆంధ్రా జనం మీద నికృష్టపు వ్యాఖ్యలు చేయటానికి మాత్రం ఒక్క అవకాశం కూడా వదలుకోరు. మీ అతి ఇంక చాలు.

    ReplyDelete
    Replies
    1. భ్రమరావతి రియల్ ఎస్టేట్ గ్రాఫిక్కుల దందాలకు మీరు రాసిందానికి ఇసుమంతయినా సంబంధం ఉందా అనామకోత్తమా? ఆవు వ్యాసం వద్దు, కుదిరితే ప్రస్తుత టపా విషయం గురించి రాయండి థాంక్స్.

      Delete
  8. కెసిఆర్ గారి పూర్వీకులు విజయనగరం ప్రాంతం వాళ్లన్న సమాచారం చదివినట్లు గుర్తు. అదే నిజమైన పక్షంలో ఆయన తెలంగాణ వాదం పూర్తిగా రాజకీయ పరమైనదే తప్ప మరొకటి కాదు. అయినా తమ అధినాయకుడిగా ఆయన్ని అంగీకరించగలిగిన (ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణాలో స్థిర పడటం) విశాల హృదయం ప్రదర్శించగలిగిన జై లాంటి విద్యాధికులకు అదే వ్యక్తుల పూర్వీకుల గడ్డపై అక్కసు, దురభిమానం ఎందుకో అర్ధం కాదు. ఒక విధంగా జై గారిది దురభిమానంగా కూడా వర్గీకరించకూడదేమో - ద్వేషం అనడం కరెక్టేమో! ఆ ద్వేషం వెనుక వేరేమైనా కారణాలు ఉండి వచ్చునెమో! బహుశా అవి వారు అంగీకరించడానికి గాని లేదా బహిరంగపర్చడానికి (may be more correcly so) గాని ఇష్టపడకపోవచ్చు కూడా! ధృతరాష్ట్రుల వారికి తన వైపు వారి తప్పులు ఒప్పులుగానూ పరులవి కేవలం తప్పులు మాత్రమే ఎన్నదగినవి గానూ ఉండటంలో ఆశ్చర్యమేముంది. అలాగే జై గారి వ్యవహార శైలి కూడా!
    ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా తెలంగాణా అన్నది కేవలం రెండు పార్టీల (పక్షాలు+పార్టీలు) అధికార దాహపు పునాదులపై ఏర్పడ్డ రాష్ట్రమే తప్ప - కారణాలు సహేతుకమే కావొచ్చు - కానీ సహేతుకమైన పునాదుల పై ఏర్పడ్డ రాష్ట్రం మాత్రం ఖచ్చితంగా కాదు. అయినప్పటికీ తెలంగాణా రాష్ట్రం ఏర్పడినందుకు గాను ఆంధ్రుల్లో - ఏర్పరచబడిన విధానంపై తప్ప ఏర్పడటం విషయంలో ద్వేషం లేదు. (దానికి తిరుగులేని దృష్టాంతం కెసిఆర్ గారు అమరావతి శంఖుస్థాపనకు వచ్చినప్పుడు, ఈ మద్య కాలంలో వైజాగ్ వచ్చినప్పుడూ, ఆంధ్ర ప్రజలు వారికి ఆదరపూర్వకంగా కేరింతలతో కొట్టిన జేజేలే). దురదృష్టవశాత్తు జై గారి లాంటి వాళ్ళు ఆంధ్ర విషయంలో ఆ సహనాన్ని గాని, సంస్కారాన్ని గాని అలవర్చుకోవడంలో ఎందుకనో ఇప్పటివరకు సఫలీకృతులు కాలేకపోతున్నారు, తమ సంకుచిత బుద్ధిని వదులుకోలేక పోతున్నారు. కాలం ఎంత కరుడుకట్టిన వారినైనా ఎప్పటికో ఒకప్పటికి మార్చుతుందని అంటారు. జై గారు మినహాయింపు లిస్టులో ఉండరని, కూడదని మనస్ఫూర్తిగా ఆశిద్దాం - ఓ తెలు'గోడు'.

    ReplyDelete
    Replies
    1. "దాన వీర శూర కర్ణ" చిత్రంలో దుర్యోధనపాత్ర చెప్పినట్టు పూర్వీకుల గతాన్ని ఇపుడు మనం తవ్వుకోకూడదు ఎందుకంటే సైన్స్ ప్రకారం మానవులందరూ ఒక తల్లి పిల్లలే - జనాభా పెరిగిన తరువాత, అవసరాల నిమిత్తమో లేక మరొకటో కానీ తెగలుగా, జాతులుగా, ప్రాంతాలుగా విడిపోయారు. కాబట్టి ఎపుడో కొన్ని వందలేళ్ళ క్రితం కెసిఆర్ గారి పూర్వీకులు ఎవరు అన్న విషయం అప్రస్తుతం. అలాగే తెలంగాణ ఉద్యమ కారణాల అంశం కూడా. తెలంగాణ ఉద్యమం కెసిఆర్ కు పూర్వం కూడా ఉండేది, కొన్నేళ్ళు స్తబ్దుగా ఉండిన ఉద్యమానికి కెసిఆర్ ఊపు తెచ్చారు. తెలంగాణ ఉద్యమం రాజకీయ కారణాల వల్ల ఉత్పన్నమైనది కాదు. తెలంగాణ ఏర్పాటు వెనుక అనేకమైన సహేతుకమైన కారణాలు ఉన్నవి అని నమ్ముతాను, అదే సమయంలో మీరన్నట్టు ఆంధ్రులలో తెలంగాణ ఏర్పాటు పట్ల కంటే, ఏర్పాటు జరిగిన విధానం మీదే అసంతృప్తి అన్నది వాస్తవం. తెలంగాణ ఏర్పాటు తరువాత ఆంధ్రకు వచ్చిన కెసిఆర్ కు జై కొట్టడం గురించి మనం గొప్పగా చెప్పుకుంటే; విభజన అనంతరం కూడా మన నాయకులను (వారి దృష్టిలో తెలంగాణ ద్రోహులు) వారి గడ్డమీదే ఉండనివ్వగలిగిన, వారు వెళ్ళినపుడు తగిన స్వాగత సత్కారాలు అందివ్వగలిగిన గొప్పతనం వారిది అవుతుంది కదా. ఇక జై గారిది ఆంధ్ర పట్ల ద్వేషం అని నాకు అనిపించలేదు, నాకు అనిపించిందేంటంటే ఆయనకు ఆంద్ర పట్ల కంటే ఎక్కువగా చంద్రబాబు గారి పట్ల కోపం (లేదా ద్వేషం) ఎక్కువ అని. మన దౌర్భాగ్యం కొద్దీ చంద్రబాబును విమర్శించడం అంటే ఆంధ్రను విమర్శించడం అని ఆ రెండు పత్రికలూ ఒక ఫీలింగ్ ను కలుగజేసాయి. ఆవుకథ అనుకోకపోతే - ఇపుడు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూల కారణం చంద్రబాబు గారే (అది వేరే వ్యాసంలో సవివరంగా రాస్తాను) అయినా వ్యాసం యొక్క ప్రధాన అంశం మూడు రాజధానుల ప్రకటన గురించి. ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ ఆల్మోస్ట్ అది అయినట్టే లెక్క. ఏ చర్య ఖచ్చితంగా బహుముఖాభివృద్ధికి, వెనుకబడిన ప్రాంతాలు ముందంజ వేయటానికి దోహదకారి కాగలవని నమ్ముతాను. చూద్దాం 

      Delete
    2. కెసిఆర్ పుట్టుపూర్వోత్తరాలు, అతను ఏమి తాగుతాడు వగైరాల గురించి నాకు ఆసక్తి సున్నా. తెలంగాణా ఉద్యమంలో కొంత పాత్ర పోషించే అదృష్టం దక్కడం అతడి అదృష్టం తప్ప అతనేమీ వాదానికి సూత్రధారుడు కాదూ, ఉద్యమం అతడితో వచ్చిందీ కాదు.

      ప్రస్తుత టపా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపాదిత పరిపాలనా వికేంద్రీకరణ గురించి: ఇందుట్లో ఇతరత్రా విషయాలను గుంజడం అవివేకం, అసమంజసం కూడా.

      జగన్ ఊరూరా తిరిగి జనం కష్టాలను స్వయంగా చూసిన జననేత, ప్రజాపక్షపాతి. ఆయనకు ప్రజానాడి తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. కులగజ్జి పచ్చ మీడియా & రియల్ ఎస్టేట్ మాఫియా గట్రాల అంగ/ధన/కుల/బలాలు జనబలం ముందు బలాదూర్.

      ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, అందునా ముఖ్యంగా బడుగులు & బక్క రైతులు/కూలీలు, వికేంద్రీకరణ వలన లాభమే తప్ప నష్టం లేదు. భ్రమరావతి మయసభ మాయాజలతారు వలలో చిక్కిన అతి కొద్ది మంది ఎంత అడ్డుకున్నా చరిత్ర గమనాన్ని ఆపలేరు. ఊరందరిదీ ఒకదారయితే ఉలిపికట్టది ఇంకోటన్నట్టు వ్యవహరిస్తున్న కల్లబొల్లి "విజనరీలు" జనహోరులో కొట్టుకుపోవడం తధ్యం.

      Delete
  9. అధికార వికేంద్రీకరణ అన్నది శుష్క నినాదం కాదు. ఇప్పటికే అమలయిన గ్రామ వాలంటీర్లు & గ్రామ సచివాలయాలు దేశంలోనే విప్లవాత్మక సంస్కరణ, మిగిలిన అన్ని రాష్ట్రాలకూ ఆదర్శం.

    ప్రతిపాదిత "మూడు రాజధానుల"తోబాటు రీజనల్ కౌన్సిల్ & మినీ-సెక్రెటేరియట్ కూడా మొదలెట్టే అవకాశాలు మెండు. జిల్లాల పునర్వ్యవస్తీకరణ అంశం మానిఫెస్టోలో చెప్పిందే, వచ్చే ఏడాదిలో ఇందుకు అడుగులు పడే సూచనలు ఉన్నాయి. చివరిగా తండా/గూడాలను (ప్లస్ బెస్తవాడలను) పంచాయతీలుగా మార్చే విధానం కూడా తెస్తే "ప్రజల వద్దకు పాలన" పూర్తిగా సఫలీకృతం కాగలదు.

    Genuine people's empowerment requires truly visionary leadership, not faltu stuff like building rekula shedlu.

    ReplyDelete
    Replies
    1. @jai
      ఇప్పటికే అమలయిన గ్రామ వాలంటీర్లు & గ్రామ సచివాలయాలు దేశంలోనే విప్లవాత్మక సంస్కరణ, మిగిలిన అన్ని రాష్ట్రాలకూ ఆదర్శం.
      hari.S.babu
      ఆ గ్రామ వాలంటీర్ల పదవీ బాధ్యతలు ఏమిటో చెప్పగలరా?మొదట రేషను సరుకుల్ని సంచుల్లో వేసుకుని ఇంటింటికీ తిరిగి అందించటం కోసం అని చెప్పారు.ఆ సంచులేవీ కనబడని స్థితి ఇవ్వాళ.ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష జరిపి మరీ ఎన్నుకున్న ఆ గొప్ప ఉద్యోగం సృష్టించబడిన ఉద్దేశం ఏమిటి?

      రేషను స్సైకిళ్ళ మీద తీసుకెళ్ళడం బాధయ్త అయితే అది పౌర సరఫ్రాల శాఖకు సంబంధించినది కావాలి, ఇవ్వాళ చూస్తే వారిని పంచాయితీకి అతికించారు - పంచాయితీ రాజ్ శాఖ అన్ని నిర్వచనాలతోనూ ఎప్పుడో నిర్వచించబడి కొనసాగుతూ ఉన్నది.ప్రస్తుతం అయితే వారు చేస్తున్న పనులు ఏమీ లేనట్టు తెలుస్తుంది.మా వూరి పంచాయితీ క్లర్కు నా బాల్యస్నేహితుడు.అతను చెప్పినదే ఇది.నెలకు 250 కోట్లు ఖర్చు చేసి అంతమందిని కూర్చోబెట్టి మేపడం మీకు అన్ని రాష్ట్రాలకీ ఆదర్శం అనేటంత అత్యుత్తమంగా కనిపిస్తున్నదా? నెలకి 250 కోట్లు వారికి జీతాల చొప్పున వెళ్తున్నదని మాత్రం నాకు తెలుసు.కానీ జగన్ భక్తిలో తరించిపోతున్న ఏక్కువ తెలిసి ఉండొచ్చుననీ తెలుసుకుని నేనూ ఆనందించుదామని ఉంది - మీరు చెప్పింది అద్భుతమనిపిస్తే మారు మనస్సు పొందే అవకాశం కూడా ఉంది, ప్రయత్నించండి.

      Delete
    2. "మొదట రేషను సరుకుల్ని సంచుల్లో వేసుకుని ఇంటింటికీ తిరిగి అందించటం కోసం అని చెప్పారు"

      రేషన్ సరుకులు కాదండీ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం.

      Reference: https://apgramavolunteer.com/ap-grama-volunteer-duties/

      పంచాయితీ గుమాస్తాల విధులు వేరే, ఉ. సమావేశాల (గ్రామసభల) మినిట్స్ రికార్డ్ చేయడం.

      ప్రజల వద్దకు పాలనలో మొత్తం నేను ఏడు అంశాలను సూచించాను. గ్రామ/వార్డు స్వవయంసేవక వ్యవస్థ ఇందులో ఒక భాగం మాత్రమే.

      ఇంకా నేను రాయనివి (మరియు నాకు తట్టనివి) కూడా ఎన్నో సంస్కరణలు ఉండే అవకాశాలు మెండు. Decentralization is a journey, not a destination.

      Delete
    3. @jai garu I liked your words 'decentralization is a journey, not a destination' and I totally agree on this with you.
      To all - let the discussion be healthy and restricted to the topic of the decentralization of development in the name of classifying the capitals in to three categories and please don't target individuals. I personally believe this decision is for good and will do good. And, to take a call on it we should wait at least for couple of years to see what they actually try to implement. Hope you all got what I am trying to explain ...

      Delete
    4. the work of Door Delivery of the welfare schemes of Government of Andhra Pradesh to each necessity house under his/her appointed area.- పధకాల్ని మోసుకు పోయి గుమ్మాల దగ్గిరకి చేర్చడం అంటే ఏమిటి?

      The Group of houses which handled to the volunteers will do the service to the necessity houses/ peoples irrespective of Caste, Religious, and Politics. అని మాత్రమే చెప్పారు, ఎలాంటి సర్వీసుల్ని వారికి అనుసంధానించారనేది స్పష్తత లేదు.

      The volunteer has to attend the meeting held in Grama/ ward secretariat and should have to maintain the record of the issues and requests which collected from the Group of Houses under him/ her and also submit the maintained record to the competent authority. అనేవి పంచాయితీ క్లర్కులు చేస్తూనే ఉన్నారు కదా!

      The volunteer has to do surveillance of the Group of Houses under him/ her regarding security, Educational, Health and should have told them or aware them about employment. - సెక్యూరిటీ పోలీసింగ్ అనుకుని ఆరోగ్య రక్షణ వైద్యశాఖకి సంబంధించినది అనుకున్నా ఆయా శాఖలలో చట్టపరమైన సవరణలు చేసి ఒక్కో పనికీ ఒక్కో ఉద్యోగిని పూర్తి కాలం ఆ విధికే నియమిస్తే ఫలితం బాగుంటుంది కదా!

      రేషన్ సరుకుల డెలివరీ పౌర సరఫరాల శాఖకు సంబంధించినది - ఆ శాఖకు ఈ విలేజి అసిస్టెంట్లని అనుబంధం చెయ్యడం జరిగిందా?ఆరోగ్య విధుల కోసం ఈ విలేజి అసిస్టెంట్ల వ్యవస్థని వైద్యశాఖకు అనుబంధం చెయ్యడానికి రూపందించిన నిబంధనలు ఉన్నాయా? చెయ్యాల్సిన పనుల్లో ఇంత వైవిధ్యం ఉన్న విధుల్ని సాంకేతికపరమైన నియమనిబంధనలూ జాగ్రత్తలూ ఏమీ లేకుండా కలగాపులగం చేసి ఒకే వ్యక్తికి దఖలు పరచడం ఎంతవరకు సమంజసం?

      నాకైతే అయోమయంగా ఉంది!

      Delete
    5. హరి బాబు గారూ, వెబ్ సైటులో ఉన్నది హై-లెవెల్ ఉద్యోగ విధులు (job description). విధి విధానాలు, ఆఫీసు సర్క్యులర్ వగైరాలు ఇంకా ఎన్నో పబ్లిక్ డొమైన్ కానివి కూడా ఉంటాయి కదా. సమన్వయ లేమి, అవకతవకలు, కన్ఫ్యూషన్ గట్రా తప్పకుండా వస్తాయి కానీ అటువంటివి వచ్చినా సరిదిద్దుకొనే యంత్రాంగం కూడా పాలనా వ్యవస్థలో ఉండే ఉంటుంది.

      There will be teething problems but overall direction is important. ప్రతిపాదిత సంస్కరణ బాలారిష్టాలు దాటి నిలదొక్కుకోవాలని, తద్వారా బహుళాంధ్ర ప్రజానీకానికి మేలు జరగాలని ఎదురు చూద్దాం.

      Delete
  10. కాకపొతే మీరు ఈ ఏమీ సాధించలేని అజ్ఞాన అజ్ఞాతల పాత కక్షలకు, నీ వెంటే నేనుంటా ఘాడ అనుబంధాలకు ఒక అచేతనమైన వేదికగా నిలబడి పోయారు. అంతే, మరంతకన్నా ఇక్కడ విషయమేం లేదు బుర్ర తెగ బరాబరా గోక్కోడానికి. అల్ ఐస్ వెల్. అది ఇప్పట్లో కరిగేది కాదు. :)

    ReplyDelete
  11. వంశీ గారికి,
    మూడు రాజధానులను సమర్ధిస్తున్న మీ వాదనతో విభేదిస్తూ నేనొక పోష్టు వేసాను నా బ్లాగులో.ప్రస్తావించాల్సిన విషయం ఎక్కువ ఉండటం వల్ల అట్లా చేశానే తప్ప మీపట్ల సతృభావం అంటూ ఏదీ లేదు. అయితే అది పోష్టు చేసిన వెంటనే మీకు తెలియపరచడం మర్యాద.కానీ అది కుదరలేదు - ఆఫీఎసు పనుల ఒత్తిడితో నా బ్లాగింగ్ వేగమే తగ్గింది.ఇదువరకు రోజుకో పోష్టు వేసేవాణ్ణి!

    మీ వీలును బట్టి అక్కడ మీ అభిప్రాయం చెప్పగలరు.రీసెంట్ పోష్టు కాబట్టి harikaalam.blogspot.com దగ్గిర చూడవచ్చు. కుదిరితే ఇదే కామెంటులో నా పోస్టు లింకును కూడా ఇస్తాను - కుదరకపోతే మరొక కామెంటులో ఇస్తాను.
    భవదీయుడు
    హరి.S.బాబు

    ReplyDelete
    Replies
    1. Hari garu, will see your article, I did not get chance to look at it. And, I too don't have any personal grudge against anyone including cbn. All I try to do is based on policies. I try to learn but don't want to be static with mindset. I am a keen observer of politics since 2+ decades from in and out from both parties. And, as you too said, no personal grudge ... just my views are different than yours I believe. We may be looking the same fact from different ends.

      Delete
  12. This is my post which had references of you link and opinions, and my best wishes for maintaining your blog in a decent way!
    http://harikaalam.blogspot.com/2020/01/blog-post.html

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

... మూడో కూటమి

... 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు - జనసేన