Posts

Showing posts from January, 2016

మేధావుల భయం సమాజానికి మంచిది కాదు ...

వంశీ కలుగోట్ల// మేధావుల భయం సమాజానికి మంచిది కాదు ... // ****************************** ****************************** ***************        'అతడు' సినిమాలో ప్రారంభంలో ఒక సన్నివేశం ఉంటుంది. సాయాజీ షిండే పాత్రధారి ఎన్నికల ప్రచార పర్వంలో తనమీద కాల్పులు జరిపించి సానుభూతి సంపాదించి తద్వారా ఎన్నికల్లో గెలిచి 'వీల్ చైర్ టు సిఎం చైర్' ప్రయాణం చెయ్యాలనుకుని పథకం రచిస్తాడు. సినిమాలో ఏమి జరిగిందనేది వేరే కథ. అలాగే బహుశా 'విజయానికి అయిదుమెట్లు' లో అనుకుంటాను యండమూరి వీరేంద్రనాథ్ గారు మరొక చక్కని ఉదాహరణ చెప్తారు. "ఒక పిల్లాడు పదవతరగతి పరీక్షలు తప్పిపోయాడనుకుందాం. వెంటనే అతడు ఇంటికి వస్తే తండ్రి చేతిలో తన్నులు, తిట్లు గట్రా. అదే ఆ పిల్లాడు దారి మధ్యలో ఏదో బావిలో దూకాడనుకుందాం. దారిన పోయేవారెవరో చూసి, రక్షించి, ఇంటికి తీసుకువస్తే అప్పుడు పరీక్ష తప్పాడన్న కోపం కన్నా కొడుకు దక్కాడన్న ఆనందం ఉంటుంది. అంతేకాక, పరీక్షలదేముందిలేరా మళ్ళీ రాయచ్చు అంటే ధైర్యం చెప్తారు. మొదటి అంశంలో అయితే కోపం ఉంటుంది అదే రెండో అంశంలో అయితే సానుభూతి ఉంటుంది." ఈ సానుభూతి అనేది ఉందే అది ఒ

... శ్రీరంగనీతులు

... శ్రీరంగనీతులు *****************        యండమూరి వీరేంద్రనాథ్ గారి గురించి కొత్తగా ఎవరికీ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటాను. నవలా, కథా, వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయితగా; వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా ఆయన సుపరిచితులు. మొదటగా - యండమూరి వీరేంద్రనాథ్ గారు తన పలు వ్యక్తిత్వ వికాస రచనలలో ప్రస్తావించిన ఒక విషయం ప్రస్తావిస్తాను. 'ఏదైనా ఒక రంగంలో అత్యున్నత స్థానాన్ని పొందిన వారు, కొద్ది కాలానికి కొత్త నీరు వచ్చిన తరువాత పాతబడిపోతారు. అపుడు వారు అస్థిత్వ సమస్యను ఎదుర్కుంటారు. దీన్నే ఆంగ్లంలో ఐడెంటిటీ క్రైసిస్' అంటారు. సినిమా నటులు కానివ్వండి, రచయితలూ, కవులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, పారిశ్రామిక వేత్తలు - ఇలా ఎవరైనా, యే రంగం వారైనా కావచ్చు; అత్యున్నత స్థాయిని అనుభవించాక కొత్త వారు ఉన్నత స్థానానికి చేరినపుడు వారికి అస్థిత్వ సమస్య మొదలవుతుంది. కొందరు మార్పును అంగీకరించి హుందాగా పెద్దరికం పాత్ర ధరిస్తారు, విలువ నిలుపుకుంటారు. ఇక మిగతావారు నోటికోచ్చినదల్లా మాట్లాడుతూ, ఎదుటివారిపై ప్రత్యేకించి ఉన్నతస్థానంలో ఉన్నవారిపై ఏవో ఒక విమర్శలు చేస్తూ, తమ గతకాలపు నీడలోనే

అందరూ రాయాలి ...

వంశీ కలుగోట్ల // అందరూ రాయాలి ... // ********************************** "ఎప్పుడూ వెనక్కు తిరిగి గతాన్ని చూసేవారిని నిందించడం నేడు పరిపాటి అయింది. ...  ఈ గతం నుండే భవిష్యత్తు రూపొందించవలసి ఉంది. ఈ ప్రాచీనతే భవిష్యత్తు కాగలదు."        వేదాల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు వేద పండితులు కానీ, విద్వాంసులు కానీ, వాటిని నమ్మేవారు కానీ చెప్పే మొదటి మాట 'వేదాలు అపౌరుషేయాలు'; వేదజ్ఞానం నిర్లక్ష్యం చేయబడింది అని. వేదాలు ఎవరి చేత చెప్పబడినవి కావు, దేవుళ్ళ దగ్గరనుంచి అందరూ వీటిని తెలుసుకుని తదనంతర తరాల వారికి అందించినవారే కానీ సృష్టించిన వారు కాదు. మొట్ట మొదట వేదాలను తెలుసుకున్న వారు వారికి ఎంత తెలుసో అంత అక్షరబద్ధం చెయ్యలేదు. అప్పట్లో ఆచారం లేదా పధ్ధతి ఎలా ఉండేది అంటే - తమకు తెలిసిన విషయాలను గురువులు శిష్యులకు బోధించేవారు. గురువులు చెప్పే మొత్తం విషయంలో శిష్యుల శక్తి మేరకు గ్రహించగలిగినంత వరకు గ్రహించగలిగే వారు. ఇప్పుడు చూస్తున్నాం కదా గురువులు చెప్పే విషయంలో శిష్యులు ఎంత నేర్చుకోగలుగుతున్నారో ... అప్పట్లో కూడా అంతే పెద్ద తేడా ఏమీ ఉండేది కాదనే అనుకుంటున్నాన

'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా గురించి నా రాత ...

'ఎక్స్ ప్రెస్ రాజా'  సినిమా గురించి నా రాత ...  *******************************************        'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా గురించి చెప్పే ముందు ఒక చిన్న ప్రస్తావన. ఈ సినిమా దర్శకుడు మేర్లపాక గాంధీ, ప్రముఖ రచయిత మేర్లపాక మురళిగారి తనయుడని మొన్ననే ఎక్కడో చదివాను. స్వాతి వారపత్రికలో మేర్లపాక మురళిగారి ధారావాహికలు చాలా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఆ రచనల్లో ఉండే 'పెద్దలకు మాత్రమే' తరహా అంశాలు బాగా ఆకట్టుకునేవి. మేర్లపాక గాంధీ చిత్రానువాదం తీరు (స్క్రీన్ ప్లే) చూస్తుంటే నాకైతే ముఖ్యంగా మేర్లపాక మురళిగారి 'శృంగారపురం ఒక కిలోమీటర్' అనే ధారావాహిక/నవల గుర్తుకువస్తోంది. చిన్న చిన్న కథల గొలుసులా ఉంటుంది ఆ నవల. అందులో 'పెద్దలకు మాత్రమే' అంశాలు పక్కనబెడితే ఆ కథావస్తువును చిన్న చిన్న ఉపకథలతొ నడిపిన తీరు అప్పట్లో నాకు తెగ నచ్చేది. కథలోని ప్రధాన వస్తువు నడక దెబ్బ తినకుండా, దానికి ఉపకరించే విధంగా ఉండే ఉపకథలు ఎన్నుకోవడం బావుండేది. ఇప్పుడు 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమా చూస్తుంటే అదే గుర్తుకు వచ్చింది. తండ్రి రచనలో అవలంబించే తీరును గాంధీ చిత్రానువాదంల

చదువు'కొనడం' గురించి ...

వంశీ కలుగోట్ల // చదువు'కొనడం' గురించి ... // **************************************** 'దేశమును ప్రేమించుమన్న, మంచియన్నది పెంచుమన్న'        కొద్ది రోజులుగా చూస్తున్నాను చాలామంది మిత్రులు, ఇతర సోషల్ మీడియా మేధావులు కొందరు 'విదేశాలలో విద్య ఉచితం, భారతదేశంలో మాత్రం లక్షల కొద్దీ డబ్బు పోసి కొనాల్సివస్తోంది' అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. ముందుగా ఒక విషయం నేను వారిని వ్యక్తిగతంగానో, మరే విధంగానో విమర్శించాలన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాయట్లేదు. కానీ, ఆపోహలను నివృత్తి చెయ్యటానికి; మన దేశం గురించి తప్పుడు సమాచారం ప్రచారం చెయ్యటం మంచిది కాదు అన్న ఉద్దేశ్యంతో మాత్రమే. సోషల్ మీడియా ప్రాచుర్యం పెరిగాక మిడి మిడి జ్ఞానంతో తెలిసీ తెలియని విషయాలను ప్రచారం చెయ్యటం చాలా సులువు అయింది. పత్రికలలో లేదా ఛానెల్స్ లో అయితే సంపాదక సిబ్బంది పరిశీలించే అవకాశం ఉంది, అదే ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలోనైతే వర్మ లాగా 'నేను ... నా ఇష్టం' తరహాలో ఎవరికీ తోచింది వారు రాసుకోవచ్చు. కానీ ఆ రాసుకోవటంలో వ్యక్తులను విమర్సించటానికి, వ్యవస్థలను విమర్సించటానికి తేడా లేకుండా ర

మళ్ళీ 'ఒకే ఒక్కడు' చూపాల్సిందే ...

మళ్ళీ 'ఒకే ఒక్కడు' చూపాల్సిందే ...  ************************************         ఆ మధ్యన ఎప్పుడో మనం పైసా ఇవ్వక్కరలేదు, స్థలం సేకరిస్తే సింగపూర్ కంపెనీలే మొత్తం కట్టి మనకు ఇస్తాయి - రాజధాని మనది, నిర్మాణం వాళ్ళది అన్నారు. అసలు 'నా అమరావతి, నా ఇటుక' అన్నప్పుడే ఏదో తేడా అని అనుమానం వచ్చింది. ఆ పేరు కింద ఎంత సేకరించారు అది దేనికి ఖర్చు పెట్టారు లేదా పెట్టబోతున్నారు తదితర వివరాలేవీ ఎవరికీ తెలియదు. అలవాటు ప్రకారం దానిపై కూడా ఒక శ్వేత పత్రం విడుదల చేసి పడేస్తే పోలా. ఒకసారి భారీగా భూమి పూజ, మరొకసారి అత్యంత భారీగా శంఖుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. చివరకి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, బడుగు విద్యార్థుల నుండి కూడా ఒక్కొక్కరి నుండి రూ. 10/- కి తక్కువ కాకుండా విరాళాలు సేకరించాలని సర్కులర్ జారీ చేయడమేంటి? ఇప్పటికి హై కోర్ట్ వద్దన్నదని మానేస్తారని నమ్మకాలు లేవు. అలవాటేగా ఎవరికీ తెలీకుండా రహస్య జీవోలో లేకపోతే 'నా అమరావతి, నా పుస్తకం' అనో లేదో ఇంకో పేరో పెట్టి పీల్చేస్తారు, అనుమానం లేదు.         ముందుగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏయే సింగపూర్

'... ట' వార్తలు

వంశీ కలుగోట్ల // '... ట' వార్తలు // *****************************        వార్తలందు '... ట' లేదా '... భోగట్టా' వార్తలు వేరయా మతిలేని చదువరి సొంబేరయ్యా. 'నిజం దేవుడెరుగు, నీరు పల్లమెరుగు' అన్న సామెత పుట్టుకకు కారణభూతం ఈ '... ట' లేదా '... భోగట్టా' వార్తలే. ఇవ్వాళ్టి రాజకీయాలలో అంటే అదేనండీ మీడియా రాజకీయాలలో ఈ భోగట్టా వార్తలకు, '... ట' వార్తలకు ఉన్నంతటి ప్రాధాన్యత మరి వేటికీ లేదు. వీళ్ళు తమకు ఉన్న ముసుగులో చిత్తానికి వచ్చినట్టు, ఏది పడితే ఆది రాసేసి చివర్లో ఒక '...ట' తగిలించేసి బతుకులను బజారున పడేసి వినోదం తిలకిస్తారు. ఉదాహరణకి ఎవరేనా రాజకీయ నాయకుడు ఏదో ఒక కేసులో విచారణ ఎదుర్కుంటూ అరెస్ట్ అయ్యాడనుకుందాం. జైల్లో, విచారణ పర్వంలో వారికి జరిగే మర్యాదలు ఎటువంటివో లోకవిదితమే. కానీ, వ్యతిరేక వర్గానికి చెందినా మీడియాలో 'కొట్టబోతే ఆయన ఏడ్చాడట', 'నిజం ఒప్పుకోకపోతే కొడతామన్నారని భోగట్టా', 'పాతికేళ్ళు శిక్ష పడొచ్చని న్యాయనిపుణులు అనుకుంటున్నట్టు భోగట్టా', 'శిక్ష పడాల్సిందేనని ప్రజలు కోరు