Posts

Showing posts from November, 2015

'మార్పు'కు బాధ్యత ఎవరిది?

వంశీ కలుగోట్ల // 'మార్పు'కు బాధ్యత ఎవరిది? // ******************************************      "ఆలోచన" మతం లాంటిది. నువ్వు దాన్ని ఎంత బలంగా నమ్ముతావో అంత బలంగా ఆచరిస్తావు ... ప్రపంచంలో ప్రతి మతం, సిద్ధాంతం, విప్లవం, మార్పు పేరేదైనా కానివ్వండి అది ఒక ఆలోచనలోంచే ఉద్భవించింది ... అందుకే స్వామి వివేకానంద చెప్పినట్లు "ఒక మహోన్నతమైన ఆదర్శాన్ని నీ జీవిత ధ్యేయంగా చేసుకో. దాన్ని గురించే ఆలోచించు. దానికి అనుగుణంగా జీవించు. నీ మెదడు, నరాలు, కండరాలు, నీ శరీరమంతా నీ ఆదర్శంతో/ఆలోచనతో నిండాలి."           దేవుడు అంటే ఒక రూపం కాదు. దేవుడు అంటే మంచి. మంచి చేసే ప్రతి ఒక్కరూ దేవుడి ప్రతి రూపాలే. అందుకే మంచి చేసిన ప్రతి ఒక్కరిని దేవుళ్ళను చేశాం, కానీ వారు చేసిన మంచిని మాత్రం ఆచరించటం లేదు. ఇలాగే మంచి చేసే వాళ్ళందరినీ దేవుళ్ళుగా చేస్తూ మనం మాత్రం దానవులుగా మిగిలిపోతున్నాం. మనం వ్యవస్థలో మార్పు రావాలి రావాలి అంటూ ఉంటాం కాని ఆ వ్యవస్థలో మనమూ భాగమనే విషయం మర్చిపోయి ఎవరో మార్పు తీసుకుని రావాలి అంటూ ఉంటాం. ఈ వాక్యాలు ఎవరో ఒకరిని ఉద్దేశించి చెప్పడం లేదు ... అలాంటి వ్యవ

పోరాటం ఆపవద్దు

పోరాటం ఆపవద్దు  ******************** ఈ ప్రపంచం మొత్తం మీద 'ప్రయత్నం' ఒక్కటే నిజం, మిగిలినదంతా 'అబద్ధం' - గౌతమ బుద్ధుడు        గ్రీకు పురాణాల్లో 'ఫీనిక్స్' అని ఒక పక్షి ప్రస్తావన ఉంది. దాని విశిష్టత ఏమిటంటే - దాన్ని చంపి, కాల్చి, బూడిద చేసిన తరువాత కూడా అది ఆ బూడిద నుండి కూడా పునరుజ్జీవం పొందుతుంది. అది నిజమా, కాదా అన్నది అటుంచితే మనవాళ్ళు ఈ మొత్తం చర్యను ఒక అందమైన పదంతో నిర్వచించారు - 'పునరుత్థానం'.      అంతా అయిపోయిందని అనుకున్న తరువాత కూడా నేలకేసి కొట్టిన బంతిలా ఉవ్వెత్తున ఎగసి ఎదిగే వాళ్ళను చూసే ఉంటారు. సముద్రాన్ని ఎప్పుడైనా చూశారా? ఆకాశాన్ని చుంబించాలని ప్రయత్నించే ఆ అలల్ని గమనించారా? అవి కింద పడుతూనే ఉంటాయి కానీ, ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ మానవు, ఆశ వదులుకోవు. మళ్ళీ అంబరాన్ని చుంబించాలనే ప్రయత్నాన్ని మాత్రం మానవు. విజయమంటే ముందు ప్రయతించటం, సాధించేవరకు ఆ ప్రయత్నాన్ని వదలకపోవటం. చిన్న చిన్న ఆటంకాలకు, అవరోదాలకు నీరుగారిపోయి నీరసించి ఉంటే ఈనాడు మనం చూస్తున్న నాగరికత ఉండేది కాదు. ఎక్కడో చదివాను 'థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుగొనే ప్రక్

జపమో ధ్యానమో ... ఏదో ఒకటి ఆచరించి చూడండి

జపమో ధ్యానమో ... ఏదో ఒకటి ఆచరించి చూడండి ************************************************   'జ'కారశ్చ జన్మవిచ్చేదః 'ప'కారః పాపనాశనః  తస్మాజ్జప ఇతిప్రోక్తో జన్మపాప వినాశకః ॥  --- 'జ' అనగా రాహిత్యం జన్మరాహిత్యం, 'ప' అనగా పాపనాశనం. కావున 'జప'మనగా జన్మరాహిత్యం, పాప వినాశనం కలుగజేసేది అని అర్థం.      మనిషి పుట్టుకతో మానసింకంగా ఎంతో బలవంతుడు. కానీ, పెరుగుతూ వస్తూ ప్రపంచం లోని అనేకమైనటువంటి, తనకు అనవసరమైన విషయాలను పట్టించుకుంటూ, కల్మషాలను అంటించుకుంటూ దుర్బలుడుగా తయారవుతున్నారు. పుట్టుకతో అత్యంత శక్తివంతంగా ఉండే ఇంద్రియాల శక్తి వివిధ ఆకర్షణలకు, మోహాలకు లోనై శక్తిని కోల్పోతూ బలహీనమవుతున్నాయి. ఇంద్రియాలను అదుపులో ఉంచవలసిన మనసే ప్రాపంచిక సుఖాలకు, భోగలాలసతకు లోనై అదుపు పక్కదారులు పడుతోంది. మనవ పరిణామ క్రమంలో  నాగరికుడుగా ఎదుగుతూ వస్తూన్న సమయంలోనే కొందరు మేధో వంతులు ఈ విషయాన్ని గమనించారు. ఆ దశలో ఏదైనా సమస్య వస్తే దాని మూలాలు వెతికి, పరిష్కార మార్గం కనుగొనే సహనం, ఓపిక ఉండేవి. ఇప్పటిలా తాత్కాలిక ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టి, మళ్ళీ మళ్ళీ

నువ్వూ ... నేనూ ... ఒక విమర్శ

వంశీ కలుగోట్ల // నువ్వూ ... నేనూ ... ఒక విమర్శ // ****************************** ***************      ఎప్పుడు అంటిందో ఎలా అంటిందో తెలీదు కాని మనందరికీ ఒక జబ్బు అంటింది. దీని మూలాలు ఏమిటో ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కానంతగా ముదిరిపోయింది. సమస్య ఏంటంటే మనం దాన్ని జబ్బుగా గుర్తించే స్థాయిని కూడా దాటిపోయెంతగా అది మన జీవితాలలో భాగంగా ఇమిడిపోయింది. వ్యక్తిని, వస్తువును వేరు చేసి చూడలేకపోవడమే ఆ జబ్బు. ఈ మధ్యనే ఎక్కడో చదివాను 'విమర్శ అనేది వస్తువు మీద ఉండాలి కాని వ్యక్తి మీద కాదు' అని. (రంగనాయకమ్మ గారి 'రామాయణ విషవృక్షం' పుస్తకం గురించిన చర్చలో పుస్తకంలోని వస్తువు మీద కాకుండా రంగనాయకమ్మ గారి మీద వ్యక్తిగత విమర్శలు మొదలెట్టాడు ఒక ప్రబుద్దుడెవరో. దానిని సున్నితంగా తిప్పికొడుతూ ఇంకొకాయన పైవిధంగా చెప్పారు.) కానీ అది ఎంతమంది పాటిస్తున్నారు ఈ రోజుల్లో ... పత్రికలు, న్యూస్ చానెల్స్ అంటే రాజకీయ పార్టీలకు బాకా ఊదే మాధ్యమాలుగా తయారయ్యాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగ. కానీ, ఈ సోషల్ మీడియాలో కొందరు అంతకు మించి తయారయ్యారు - విషాన్ని వెలిగక్కె రాతలత

యముడి భూలోక యాత్ర: ఒకటవ రోజు (కథ) - అమరావతి సందర్శనం

యముడి భూలోక యాత్ర ఒకటవ రోజు (కథ) - అమరావతి సందర్శనం ************************************** ముందుమాట: ఇది కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంలో అల్లుకున్న కాల్పనిక కథ. ఎవరినీ నొప్పించాలని, విమర్శించాలని కాదు. కేవలం రచయిత ఊహ మాత్రమే. *                *                 * అది యమసభ - పాపుల విచారణ, శిక్షల విధింపు ఆ రోజుకి పూర్తయ్యింది. ప్రతిరోజూలానే ఆ రోజు కూడా ఎలాంటి ప్రత్యేకత లేకుండా యుగాల తరబడి సాగుతున్న వారి దినచర్యలో భాగంగా మరో రోజుకు ముగింపు పలకడం తప్ప చేసినది ఏమీ లేదు. భూలోకం నుంచి వస్తున్న పాపుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండటం అటు చిత్రగుప్తుడికి, ఇటు యమధర్మరాజుకి శిరోభారంగా మారింది. తమ బాధ్యతల నుండి కాస్త విరామం తీసుకుని స్వర్గమునకో లేక మరియొక లోకమునకో కొద్దిరోజులు వెళ్లి రావాలని యోచింపసాగాడు యముడు. విచారణ పూర్తయినందువలన పాపులు, భటులు, మిగతా అందరూ వెళ్ళిపోవడం వలన సభా మందిరంలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. బయలుదేరటానికి సిద్ధమవుతూ చిత్రగుప్తుడితో సంభాషణ మొదలు పెట్టాడు యమధర్మరాజు. యముడు: "గుప్తా! భూలోకమునుండి వచ్చు పాపుల సంఖ్యా నానాటికీ పెరిగిపోవుచున్నది, భూలోకమున పుట్టు వారి సం

Travelogue of Yamadharmaraja's visit to Bhoolok (Earth): Part 1 - Yama's visit to Amaravathi

Travelogue of Yamadharmaraja's visit to Bhoolok (Earth) ******************************************************************* Disclaimer: This is just fiction story with fantasy touch from author's imagination and views expressed in this writing are purely of writer own views. Prologue: --------------     For Yamadharmaraja and Chitragupta it was like any other days in their life, there was nothing special and exciting. Their day was filled with the routine - enquiring and punish the paapis (sinners) from Bhoolok (Earth). More than the process, the increasing number of paapis from Bhoolok every other day started bothering them. Yama was too much tired with the routine and felt like he need a break from this routine. Court hall was with filled with silence and emptyness with him and Chitragupta getting ready to move out. On the way back, he started discussing his ideas with Chitragupta. "Oh, Gupta! I am too much tired and bored with all this process. We a break and

దేవుడు - భక్తులు - మూర్ఖులు

వంశీ కలుగోట్ల // దేవుడు - భక్తులు - మూర్ఖులు // *******************************************      మనలో చాలామందిమి మహేష్ బాబు చిత్రం 'ఖలేజా' చూసి ఉంటాము. అందులో రావు రమేష్ (గ్రామ పెద్ద) మరియు షఫీ పాత్రలు బహుశా గుర్తుండే ఉంటాయనుకుంటా. నటన పరంగా ఇద్దరూ అద్భుతంగా చేశారు. ఆ పాత్రలు ఇప్పుడు సమాజంలో మనకు కనిపించే రెండు అతి ముఖ్యమైన రకాల వ్యక్తులకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఒకటి భక్తుడు రెండు మూర్ఖుడు. బహుశా త్రివిక్రమ్ సమాజంలోని ఈ ధోరణులను చూసిన తరువాతే ఆ పాత్రలు రూపు దిద్దాడేమో.      'భక్తుడు' తరహా వ్యక్తులు - ఖలేజా సినిమా గుర్తుంటే అందులో రావు రమేష్ పాత్రధారి గ్రామస్తులందరికీ తమను కాపాడేవాడు ఒకడొస్తాడు, అతడోచ్చాక అంతా మంచే జరుగుతుంది అని చెబుతూ గ్రామస్తులను ఊరిస్తాడు. ఏవేవో పూజలు గట్రా చేస్తుంటాడు. షఫీ పాత్రధారిని దేవుడిని వెతికి తీసుకురమ్మని పంపుతాడు. మహేష్ బాబు వచ్చాక అంటే అదే దేవుడు వచ్చాక 'నువ్వు దేవుడివి సామీ' అంటూ ఆ దేవుడి దైవత్వాన్ని (???) ప్రోమోట్ చేస్తూ ఉంటాడు. సినిమా నుంచి బయటకోచ్చేద్దాం - మీ పరిస్థితి బాగుపడాలంటే, అవినీతి అంతమవ్వాలంటే, నల

కలల బేహారీల ఊహాసౌధాలు మళ్ళీ కూలిపోయాయా... ?

కలల బేహారీల ఊహాసౌధాలు మళ్ళీ కూలిపోయాయా... ? ************************************************ బీహార్ ఎన్నికల ఫలితాలపై నా దృక్కోణం ...         బీహార్ ఎన్నికల ఫలితాలు అయిపోయాయి. ఇక విశ్లేషణలు మొదలు, త్వరలో రాబోయే మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల వరకూ 'ఈ ఎన్నికల ప్రభావం వాటిపై ఎంత' అన్న అంశం చుట్టూతా తిరుగుతూ, వేరే సమస్యలేమీ లేనట్టు తాము భ్రమిస్తూ ప్రజలను కూడా భ్రమింపజేస్తూ ఆ విధంగా ముందుకు పోతాయి.     భాజపా పెద్దలు, కొత్త (మరీ కొత్త కాదనుకోండి, సంవత్సరమున్నర వయస్సున్న అనుకోండి) దేవుడు గమనించవలసినది లేదా నేర్చుకోవలసినది ఏమైనా ఉన్నదా? ఉందని అనుకుంటున్నారా? గత సార్వత్రిక ఎన్నికలలో అద్భుత విజయం సాధించిన తరువాత ఆకాశం వైపు చూపు నిలిపిన భాజపా ను నేలవైపు లాగిన రెండో ఫలితం ఇది, అందునా ఇది ఢిల్లీ కంటే ఎక్కువగా చింతించవలసిన, ఖంగారుపడవలసిన, విశ్లేషించుకోవాల్సిన ఓటమి. అందరూ లేదా అధికశాతం విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే - భాజపా దారుణ ఓటమికి కారణాలుగా 'మత పరమైన కొన్ని సున్నిత అంశాలను ఎగదోసి లాభపడదామని చూడటం, వీలు కల్పించుకుని మరీ శత్రు దేశం గురించిన ప్రస్తావనలు తీసుకురా

గిరీశం కథలు - చిరంజీవి సినిమా, గిరిగాడి ఏడుపు ...(పార్ట్ 2)

వంశీ కలుగోట్ల// గిరీశం కథలు - చిరంజీవి సినిమా, గిరిగాడి ఏడుపు ... (పార్ట్ 2)// ****************************** ****************************** *************** ... కాసేపు ఏడ్చాక గిరి తనను తాను తమాయించుకుని రెండో పెగ్గు నింపుకుని సెప్పడం మొదలెడతాడు అనుకున్నాం గానీ వాడు కథ మొదలెట్టతానికి ఒక ఫుల్ బాటిల్ పూర్తయ్యింది. "మామా ... పక్క రాష్ట్రం దోస్తు తీవ్రంగా అవమానించాడు మామా, ఇజ్జత్ మొత్తం పోయింది, తలకాయ యాడ బెట్టుకోవాల్నో అర్థం కావట్లేదురా." "ఎవడురా మామా నిన్ను అంత తీవ్రంగా అవమానించినోడు, అసలు ఇంతకూ ఎందుకు అవమానించాడు? కాస్త ఇవరంగా సెప్పు మామా ... సస్పెన్స్ లో పెట్టి సంపమాక." "మామా ఇవరంగా సెప్పాలంటే ముందు నీకు మా వేంకటేశులు గాడి గురించి సెప్పాలిరా మామా." మా రాంబాబు గాడు ఈ సస్పెన్స్ తట్టుకోలేక "ఒరేయ్ ఏందిరా మామా ... థూ దీనమ్మాజీవితం ఇయ్యాల మందులో ఉన్న కిక్కు మొత్తం నీ ఎదవగోలతో ....పోతాంది. చిరంజీవి సినిమా అన్నావ్, తరువాత ఎవడో పక్క రాష్ట్రం దోస్తు ఇజ్జత్ తీసినాడన్నావ్, ఇప్పుడు జూస్తే ఇంకోడి గురించి చెప్పడం మొదలెట్టినావ్ - నీ డాష్ డాష్" అంట

మనలో ఒకడు - 4: శ్రీ జె.యెస్.అర్.కె. శర్మ గారు

మనలో ఒకడు - 4: శ్రీ జె.యెస్.అర్.కె. శర్మ గారు ****************************** ******************* 'మనలో ఒకడు' లో నాల్గవ భాగంగా నేను చూసిన వారిలో శ్రీ జె.యెస్.అర్.కె. శర్మ గారు గురించి వివరిస్తాను ...       అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు 'ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా చావండి' అన్నది ఈనాటి ఆధునికుల గురించేనేమో అనిపిస్తుంది. ముప్పై/ముప్పై అయిదు సంవత్సరాలు రాగానే పోరాడే ఓపిక తగ్గిపోతుంది. శరీరం సహకరించదు - లేదా సహకరించాలన్నా మనసొప్పదు. ఆఫీసులో పనెక్కువయ్యింది - విశ్రాంతి కావాలి; ఇంట్లో పిల్లల గోల ఎక్కువయ్యింది - విశ్రాంతి కావాలి; వారాంతంలో బయటకెళితే అనవసర ప్రయాణం, అలసట - విశ్రాంతి కావాలి; సినిమాకెళ్ళొచ్చినా అలసట - విశ్రాంతి కావాలి; ఇలా ప్రతి చోటా అలసిపోయే మనం విశ్రాంతి కోరుకుంటాం. లేదంటే కొంతమందికి శారీరక సమస్యలు మొదలవుతాయి. ఒకరకంగా చెప్పాలంటే నడిమి వయసులోనే శారీరకంగా, మానసికంగా ముసలితనం మొదలవుతుంది. కానీ ఈ గుంపులో కూడా కొందరు మానసిక యవ్వనులు, సంకల్పమే బలంగా సాగేవారు ఉంటారు. అటువంటి ఒక నిత్య యవ్వనుడు, పోరాటశీలి అయిన శ్రీ జగర్లపూడి సీతారామకృష్ణ శర్మ (జె.

మనలో ఒకడు - 2: కృష్ణ హర్ష

'మనలో ఒకడు' లో రెండవ భాగంగా నేను చూసిన వారిలో కృష్ణ హర్ష గురించి వివరిస్తాను ... కృష్ణ హర్ష ********* కృష్ణ హర్ష గురించి వివరించే ముందు ఒక చిన్న మాట - నేను వ్యక్తిగత సంభాషణల్లో కానీ, రాసే వాటిలో కానీ తరచుగా బాధ్యతల గురించి ప్రస్తావిస్తుంటాను. మనం రాజ్యాంగపరమైన, సామాజికపరమైన బాధ్యతలు స్వీకరించి, ఆచరించినపుడే హక్కుల గురించి మాట్లాడాలి, పోరాడాలి అని. కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ బాధ్యతలు స్వీకరించటానికి ఇష్టపడని ప్రతి ఒక్కరు హక్కుల గురించి మాట్లాడేవారే. పైగా 'ఏం నేనొక్కడినీ చేస్తే సమాజం మారిపోతుందా? ఈ జనాలు మారరు, వీళ్ళింతే. ఎవరో రావాలి, పరిస్థితులను మార్చాలి' లాంటి పలాయనవాదపు వాదనలు సిద్ధంగా ఉంచుకుని ఉంటారు. అలాంటి వారికి ఒక చిన్న సమాధానం/ఉదాహరణ కృష్ణ హర్ష. హర్ష ఇంకా విద్యార్ధి దశలోనే ఉన్నాడు. కానీ మరొకరికి చేయూతనందివ్వటానికి తన చదువు, పనులు అడ్డంకి కాలేదు. చాలా మందిమి రకరకాల కారణాలు చెబుతాం - వీలవలేదు, కుదరలేదు, నేనే ఇంకా జీవితంలో స్థిరపడలేదు, ఉద్యోగం లేదు, పిల్లల చదువు పూర్తవ్వలేదు, ఇల్లు కొనాలి ఇలా మనకు కారణాలకు కొదువలేదు. కానీ హర్షలాంటి వారు కారణాలు

గిరీశం కథలు - చిరంజీవి సినిమా, గిరిగాడి ఏడుపు ... (పార్ట్ 1)

వంశీ కలుగోట్ల// గిరీశం కథలు - చిరంజీవి సినిమా, గిరిగాడి ఏడుపు ... (పార్ట్ 1)// ***************************************************************************************** మా గిరిగాడు దాదాపు రెండు నెలల నుంచి కనిపించట్లేదు, వినపడట్లేదు. మామూలుగా అయితే వాడు ఎక్కడున్నా ఫేస్ బుక్ లో మహా చురుగ్గా ఉంటాడు., ఈ మధ్యన అదీ లేదు. వీడికి ఏమయ్యింది, ఉన్నట్టుండి ఇలా గాయబ్ అయ్యాడు అనుకుంటూ, గిరి గాడి గురించి తలచుకుంటూ ఉండగానే తలుపు కొట్టిన శబ్దం అయింది. శుక్రవారం కదా, ఇక మందుపార్టీకి సరంజామా తీసుకుని అందరూ వచ్చుంటారు అనుకుంటూ తలుపు తీసి చూస్తె గిరి, 'నామ్ లియా సైతాన్ హాజర్' అనుకుంటూ ... "ఒరేయ్ గిరిగా యాడికి బోయినావురా ఇన్నిరోజులు? అడ్రస్ లేవు ... " "అరేయ్ రెన్నెల్లు కావోస్తోందే ఈడు యాడున్నాడు, యాడికి బోయినాడు అని ఒక్క నా డాష్ గాడన్నా ఫోన్ అన్నా సేసినారారా? బలిసి కొట్టుకుంటున్నారు దొంగ నా డాష్ ల్లారా ... " "ఒరేయ్ ఒరేయ్ ఆపరా కాస్త కంట్రోల్ సేసుకోరొరెయ్ ... అయినా ఏమైందిరా మాంచి ఫైర్ మీదున్నవ్?" "అరె అది కాదురా మామా, రెన్నెల్ల నుంచి ఊర్లోనే ఉన్నానా, సీప్ లిక్కర