Posts

Showing posts from November, 2020

... జీహెచ్ఎంసీ ఎన్నికలు

వంశీ వ్యూ పాయింట్ // ... జీహెచ్ఎంసీ ఎన్నికలు // ********************************************             జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా ప్రతిష్టగా మారాయి తెరాసతో పాటుగా, భాజపాకు కూడా. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేడిని పెంచింది. కాంగ్రెస్, తెదేపాలకు కలిసి గానీ లేక విడివిడిగా గానీ పోటీ చేసినా ఎటువంటి ఉపయోగం లేదని తెలిసిపోయింది సమయంలో భాజపా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇంతకాలం ముందుగా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలని సాగిన ప్రయత్నాలు, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తరువాత మారిపోయాయి - 'మధ్యంతర ఎన్నికలు' అన్న బండి సంజయ్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. అయితే నగరంలో నిజంగా భాజపా అంత పట్టు సంపాదించిందా లేక తెరాస గ్రాఫ్ అంత దారుణంగా పడిపోయిందా అన్నది ముఖ్య విషయం.             ముందుగా తెరాసకు ప్రతికూలాంశాలు పరిశీలిస్తే అత్యంత ముఖ్యమైనవి రెండు - ఇటీవలి భారీ వర్షాలకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అధికార వ్యవస్థ స్పందించిన తీరు; రెండవది కరోనా పరిస్థితుల్లో అధికార వ్యవస్థ మరియు ప్రభుత్వం తీరు. కరోనా పట్ల ప్రభుత్వ తీరును అనేకసార్లు హై కోర్ట్ కూడ

... ఆకాశం నీ హద్దురా

వంశీ వ్యూ పాయింట్ // ... ఆకాశం నీ హద్దురా // ****************************************             "నుదుటినుండి స్వేదం చిందకుండా చేసేపనికి విలువ లేదు. భారతీయ మేధ ఏ ఒక్కరికీ తీసిపోదు. కానీ, మనకు ధైర్యం పాళ్ళు తక్కువ. దేశంలో యువతకు కావలసింది అపజయాన్ని చవిచూస్తామన్న భయాన్ని శాశ్వతంగా నిర్మూలించటం. విజయాభిలాషను పెంపొందించుకోవటం" అని సి.వి. రామన్ గారు చెప్పారు. మనలో అందరూ కలలు కంటారు, ఆ కలలను నిజం చేసుకోవడానికి అవసరమైన పోరాటం చేసే ధైర్యం మాత్రం అతి కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. కలలు కనే మిగతా అందరూ, ఆ ధైర్యవంతుల గురించి కథలుకథలుగా చెప్పుకుంటారు, తరతరాలుగా. అటువంటి ఒక ధైర్యవంతుడి కథ, కెప్టెన్ గోపినాథ్ గారి జీవితం ఆధారంగా సుధా కొంగర గారి దర్శకత్వంలో రూపొందిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా. మొదటి సన్నివేశం నుండి ఒక విధమైన ట్రాన్స్ లో నడుస్తుంది సినిమా. ఆ మూడ్ సినిమా అంతటా కొనసాగించడంలో సుధా కొంగర గారు విజయం సాధించారు అని చెప్పవచ్చు.             ఆకాశయానాన్ని సామాన్యులకూ అందుబాటులోకి తీసుకురావాలని తపించి, పోరాడిన చంద్ర మహేష్ మరియు అతడి మిత్రుల కథ ఇది. ఆ ప్రయాణంలో ఎయిర్లైన్స్ బిజినెస్

... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న అంశం?

వంశీ కలుగోట్ల // ... కరోనా కంటే ఎక్కువగా భయపెడుతున్న  అంశం ? // ************************************************************             చిరంజీవి గారికి కరోనా నెగటివ్ అని, మొదటి సారి పాజిటివ్ వచ్చింది కూడా ఫాల్టి టెస్ట్ కిట్ వల్ల అని తెలిసిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. మంచిది, ఆయనకు కరోనా నెగటివ్ అని తెలియడం ఆయను విపరీతంగా అభిమానించే నాలాంటి కోట్లాది మందికి సంతోషాన్నిచ్చే విషయం. కానీ, అంతటి మెగాస్టార్ గారి విషయంలోనే మొదటి రిజల్ట్ ఫాల్టి కిట్ ద్వారా అని, అది కూడా మూడు వేర్వేరు ఇతర పరీక్షల అనంతరం నిర్ధారించబడిందని అంటే ఇక ఇపుడు బయట పడుతున్న అసీంప్టమాటిక్ కేసులలో ఎన్ని నిజానికి కరోనా పాజిటివ్ మరియు ఎన్ని ఫాల్టి కిట్స్ ద్వారా తప్పుడు ఫలితాలు? పాజిటివ్ కాదు అని నిర్ధారించబడేంతవరకూ చిరంజీవి గారు ఖచ్చితంగా కొంత భయం, మనోవేదన అనుభవించి ఉంటారు. అలాంటిది ఇక సామాన్యుల బాధల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?             నిజానికి ఈ కరోనా టెస్ట్ మరియు ట్రీట్మెంట్ అన్నవి ఇపుడు మాఫియాలా తయారైంది. ప్రైవేట్ సంస్థలకు టెస్ట్ బాధ్యతలు అప్పగించడం ద్వారా ఎక్కువమందికి టెస్ట్ చేయడం సాధ్యపడిందన్నది నిజమే, కానీ అదే స