Posts

... ఏమంటారో? ఏమనుకుంటారో?

వంశీ కలుగోట్ల // ... ఏమంటారో? ఏమనుకుంటారో? // ****************************** ***************             నేను చిన్నపుడు, బహుశా దాదాపు 8 సంవత్సరాల వయసున్నపుడు అనుకుంటా ఒకరోజు పేపర్ లో ఒక వార్త చూశాను - నందికొట్కూరులో ఎవరో చెత్తకుండీలో పడేసిన పసికందును కుక్కలు పీక్కుతిన్నాయన్నది ఆ వార్త. చాలా హృదయవిదారకమైనది, కదిలించివేసింది ఆ వార్త. అది చూసిన చాలారోజుల వరకూ ఏదో తెలియని బాధ వెంటాడుతూనే ఉండేది. వివాహేతర లేదా వివాహానికి పూర్వమే ప్రేమ పేరుతొ వంచించబడిన మహిళ, సమాజానికి/కట్టుబాట్లకు భయపడి ఆ బిడ్డను వదిలించుకుందేమో బహుశా. చాలా చాలా బాధతో పాటు, ఆలోచనకూ కారణమైంది. అటువంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చేస్తే బావుంటుంది అన్న ఆలోచన మొదలైంది. చదువు కొంతవరకూ మేలేమో అనిపించింది, అంటే చదువుకుంటే అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో.             అయితే ఇపుడు కూడా జరుగుతున్న పలు ఘటనలు చూసిన/చదివిన తరువాత చదువు ప్రభావం ప్రస్నార్ధకమే అని అనిపిస్తోంది. సమాజం/కట్టుబాట్ల పట్ల ఉన్న విపరీత భయమే అటువంటి ఘటనలకు కారణం కావచ్చు. ఎవరో ఏమో అనుకుంటారని, తమను తాము అణచేసుకుంటూ, చంపేసుకుంటూ బతుకీడుస్తున్న వాళ్ళను నా అనుకునే వాళ్ళలో కూ

... మూడో కూటమి

వంశీ వ్యూ పాయింట్ // ... మూడో కూటమి // **************************************             తెలంగాణాలో ఎన్నికలు వచ్చినపుడు కెసిఆర్ గారు జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా మూడో కూటమి ఆలోచనలు చేశారు, అనేకమందిని కలిశారు. ఎన్నికల అనంతరం ఆ కూటమి ఏమైందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చినపుడు చంద్రబాబు నాయుడు గారు మోదీకి వ్యతిరేకంగా విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు, అనేకమంది ప్రాంతీయ నాయకులను కలిసి కలిసి, కొత్త కూటమి కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికల అనంతరం ఆయన చరిత్రలో ఎరుగని ఓటమితో కుదేలయ్యారు. మోదీ మాట్లాడటానికి  కూడా సాహసించటం లేదు.  పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి - దీదీ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, మూడో కూటమి ఏర్పడవలసిన అవసరం ఉందని అనేకమంది ప్రాంతీయ నాయకులకు ఉత్తరాలు రాశారు. కొత్త కూటమికి ప్రయత్నాలు చేస్తున్నారు.             వీళ్ళంతా తమకు కాసింత సెగ తగలగానే ఎగిరెగిరిపడి, ఆ తరువాత నిమ్మకుంటున్నారు. కారణాలు, అవసరాలు ఏవైనా ఒక్క కాంగ్రెస్ మినహాయించి వేరే ఏ పార్టీ కూడా మోదీకి వ్యతిరేకంగా స్థిరంగా పోరాడటం లేదు. కాంగ్రెస్ కు శక్తి సరిపోవడం లేదు, మిగతావారు ఎందుచేతనో

... తిరుపతి ఉప ఎన్నిక

వంశీ వ్యూ పాయింట్ // ... తిరుపతి ఉప ఎన్నిక // ******************************************             సిట్టింగ్ ఎంపీ దుర్గాప్రసాద్ గారి మరణంతో అనివార్యమైన తిరుపతి ఉప ఎన్నిక ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపట్ల ప్రత్యేక ఆసక్తి ఏర్పడటానికి కారణం భాజపా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం. ముఖ్యంగా భాజపా తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో కనబరచిన ప్రదర్శనతో ఉరకలెత్తుతోంది. తెలంగాణాలో లాగానే ఇక్కడ కూడా మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ రెచ్చగొట్టి, మతప్రాతిపదికన ఓట్లను పోలరైజ్ చేయాలని ప్రయత్నం చేస్తోంది. బరిలో ప్రధాన పార్టీల తీరును పరిశీలిస్తే              వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న గురుమూర్తి గారికి పార్టీ వర్గాల నుండి సహకారం, వ్యక్తిగతంగా ఎటువంటి చేదు రిమార్క్స్ లేకపోవడం, విద్యాధికుడు, సౌమ్యుడు కావడం వంటివి సానుకూల అంశాలు. కాగా స్థానిక పార్టీ వర్గాలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడం, ప్రత్యక్ష ఎన్నికలకు కొత్త కావడం వంటివి ప్రతికూల అంశాలు. అయితే జగన్ గారు వ్యక్తిగతస్థాయిలో (అంతర్గతంగా) సమీక్షిస్తూ పార్టీ వర్గాలను గురుమూర్తి గారికి అనుకూల

... "పింక్" గురించి రెండు మాటలు

వంశీ వ్యూ పాయింట్ // ... "పింక్" గురించి రెండు మాటలు // **************************************************             కొన్నేళ్ళక్రితం బాలీవుడ్ లో "పింక్" అనే సినిమా వచ్చింది. అందులో ప్రస్తావించబడిన అంశం చర్చనీయాంశం, ఆ సినిమా ఒక అద్భుతం. ప్రత్యేకించి అందులో ముఖ్యపాత్రలు పోషించిన తాప్సి, అమితాబ్, కృతి కుల్హరి, ఆండ్రియా తరియాంగ్, పీయూష్ మిశ్రా, అంగద్ బేడీ వంటివారు తమ పాత్రోచిత నటనతో సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్ళారు. ముఖ్యంగా అమితాబ్ గురించి చెప్పుకోవాలి - కోర్ట్ సన్నివేశాల్లో ఆ పాత్రలో అమితాబ్ కాకుండా మరొకరిని ఊహించడం కష్టం. బాధ, నిస్సహాయత, కోపం, నిర్లిప్తత, సానుభూతి లాంటి భావాలన్నీ ఒకేసారి పలికించగలగడం - హాట్స్ ఆఫ్ అమితాబ్ జీ. ఒక నటుడిగా ఆయన మీద గౌరవం రెట్టింపయ్యేలా నటించారు దీపక్ సెహగల్ పాత్రలో.             ఇక సినిమాలో చర్చింపబడిన అంశం - స్త్రీ ఎటువంటిదైనా, తన ప్రవర్తన ఎటువంటిదైనా, తన వస్త్రధారణ ఎటువంటిదైనా - తాను నో అంటే నో (శృంగారానికి). కాస్త కలివిడిగా ఉంటే, ఆల్కహాల్ తాగితే, పొట్టి బట్టలేసుకుని పబ్ లకు వెళితే - దాని అర్థం తన శరీరాన్ని నీకు అప్పగించడానికి సిగ్న

... ఓ రెండు మాటలు

వంశీ కలుగోట్ల // ... ఓ రెండు మాటలు // ****************************** *****             సరదాగా ఓ రెండు అంశాల గురించి కాసిని మాటలు మాట్లాడుకుందాం. ఆ రెండు అంశాల గురించి నా దృక్కోణం ఏంటనేది క్రింద వివరించాను, మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయవచ్చు.         డైటింగ్ గురించి కాస్త చెప్పుకుందాం. డైటింగ్ అనగానే అత్యధికులు తిండి తగ్గించడం/మానేయడం అనే అపోహలో ఉంటారు లేదా ఆయిల్ ఫుడ్ లాంటివి పూర్తిగా తగ్గించడం లాంటివి. కానీ అది సరికాదు. డైటింగ్ అన్నది అందరికీ ఒకేలా ఉండదు. శరీరబరువు మీద అదుపు సాధించడం అన్నది పలు ఇతర విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తినే తిండి మీద అదుపు, సమయపాలన లాంటివి. మనకు ఇష్టమైన ఫుడ్ ఉన్నపుడు విపరీతంగా తినెయ్యడం, మిగతావి తక్కువగా తినడం లాంటివి సరికాదు. ఇష్టమైనదైనా లేనిదైనా మితంగా తినాలి. తినేపుడు, తిన్న తరువాత ఇబ్బంది పడనటువంటి ఫుడ్ ను ప్రిఫర్ చేయాలి. సాధారణంగా బరువు పెరగడం అన్నది ఒక్కోవ్యక్తి బాడీ మెటబాలిజం బట్టి, అనేక ఇతర అంశాలను బట్టి ఉంటుంది. న్యూట్రిషనిస్ట్ ని సంప్రదించి, మనకు ఏది సరైనదో తెలుసుకుని అది చేయాలి. ఆలా కాకుండా టీవీలలో, పేపర్స్ లో, సోషల్ మీడియాలో ఎటువం

... ఆరోగ్యమే మహాభాగ్యం

వంశీ కలుగోట్ల // ... ఆరోగ్యమే మహాభాగ్యం // *****************************************             కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం మొదలుపెట్టిన తరువాత ప్రపంచం మొత్తం (అతిశయోక్తిలా అనిపిస్తే, అత్యధికశాతం అని చదువుకోండి) కరోనా రాకుండా ఏం చెయ్యాలి అని అన్వేషణ మొదలు పెట్టింది. దాంతో ప్రివెంటివ్ మెడికేషన్ వ్యాపారం ఊపందుకుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది అనే ప్రచారంతో అనేక కృత్రిమ ఉత్పత్తుల విక్రయం ఎక్కువైంది. అందులో అత్యధికం ఎటువంటి ప్రామాణికత లేనివే అయి ఉంటాయి. నిజానికి ఈ ప్రివెంటివ్ మెడికేషన్ అన్నది ఎంతవరకూ సమంజసం, అనుసరణీయం అని తెలిసిన వైద్య మిత్రులతో కూడా చర్చించాను. సరైన సలహా, నిపుణులతో సంప్రదించకుండా ఈ ప్రివెంటివ్ మెడికేషన్ వాడకం అన్నది సరికాదు, సమర్థనీయం కాదు అన్నది వారు చెప్పిన విషయం.             ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి, వ్యవసాయ సంబంధిత ఉదాహరణే చెప్పుకుందాం. ఒక పంట అయిపోయాక, తరువాతి పంట వేసేముందు సాధారణంగా రైతు పొలాన్ని పంటకు సిద్ధం చేస్తాడు. పొలం దున్నడం, సేంద్రియ ఎరువులు వేయడం లాంటివి అన్నమాట. కానీ పంటకు ఏ పురుగు పడుతుందో అని ముందుగానే ఊ

... జీహెచ్ఎంసీ ఎన్నికలు

వంశీ వ్యూ పాయింట్ // ... జీహెచ్ఎంసీ ఎన్నికలు // ********************************************             జీహెచ్ఎంసీ ఎన్నికలు చాలా ప్రతిష్టగా మారాయి తెరాసతో పాటుగా, భాజపాకు కూడా. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేడిని పెంచింది. కాంగ్రెస్, తెదేపాలకు కలిసి గానీ లేక విడివిడిగా గానీ పోటీ చేసినా ఎటువంటి ఉపయోగం లేదని తెలిసిపోయింది సమయంలో భాజపా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇంతకాలం ముందుగా ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయాలని సాగిన ప్రయత్నాలు, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తరువాత మారిపోయాయి - 'మధ్యంతర ఎన్నికలు' అన్న బండి సంజయ్ వ్యాఖ్యలు అందుకు నిదర్శనం. అయితే నగరంలో నిజంగా భాజపా అంత పట్టు సంపాదించిందా లేక తెరాస గ్రాఫ్ అంత దారుణంగా పడిపోయిందా అన్నది ముఖ్య విషయం.             ముందుగా తెరాసకు ప్రతికూలాంశాలు పరిశీలిస్తే అత్యంత ముఖ్యమైనవి రెండు - ఇటీవలి భారీ వర్షాలకు ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, అధికార వ్యవస్థ స్పందించిన తీరు; రెండవది కరోనా పరిస్థితుల్లో అధికార వ్యవస్థ మరియు ప్రభుత్వం తీరు. కరోనా పట్ల ప్రభుత్వ తీరును అనేకసార్లు హై కోర్ట్ కూడ