Posts

... వైద్యో నారాయణో హరిః

వంశీ కలుగోట్ల // ... వైద్యో నారాయణో హరిః // *************************************** ఇపుడు జరుగుతున్న విషయం చెప్తాను.             పరిస్థితి ఎలా ఉందంటే కాస్త దగ్గో, జలుబో, ఒళ్ళు వెచ్చబడటమో జరిగితే లోలోపల దడ పుడుతోంది. అలాగని వెంటనే హాస్పిటల్, దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకో వెళ్ళటానికి కూడా భయం. మరేం చేయాలి ... ??? అపుడు గుర్తొస్తారు మన ఫ్రెండ్స్ లో డాక్టర్స్ లేదా తెలిసిన డాక్టర్, మన ఫ్రెండ్స్ డాక్టర్ - ఇలా వాళ్ళకు ఫోన్ చేసి వివరాలు చెప్పి, వాళ్ళ సలహా తీసుకుంటాం. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో బయటకు, అదీ రద్దీ ఎక్కువగా ఉండే హాస్పిటల్స్ లాంటి ప్రదేశాలకు వెళ్లాలంటే భయం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో అనేక ప్రైవేట్ (వెల్, ప్రైవేట్ అనేకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అనాలేమో) హాస్పిటల్స్ సాధ్యమైనంత దండుకుంటున్నాయి. నిజానికి సీరియస్ కండిషన్ లేకపోతే హోమ్ క్వారంటైన్ లో ఉండి, డాక్టర్స్ సలహాలతో మందులు తీసుకుంటూ ఉండవచ్చు అని ప్రభుత్వాలు స్పష్టం చేసినప్పటికీ జనాలు పట్టించుకోవడం లేదు.             ఇక్కడ నష్టపోతున్నది ఎవరంటే ఆ డాక్టర్ ఫ్రెండ్స...

... ఎవరి తప్పులు/ఆశలకు ఎవరు బాధ్యులు?

వంశీ కలుగోట్ల // ...  ఎవరి తప్పులు/ఆశలకు ఎవరు బాధ్యులు? // ****************************** **************************             ఇవాళ ఈనాడులో 'మధ్యతరగతి ఆశలపైపిడుగు ' అంటూ ఒక ఆర్టికల్ రాశారు. రాజధాని తరలిపోవడంతో అక్కడ ప్లాట్లు కొన్న అనేకమంది మధ్యతరగతివారు నష్టపోబోతున్నారు అన్నది ఆ ఆర్టికల్ సారాంశం. ఈనాడు వారు (లేదా ఆంధ్రజ్యోతి, సాక్షి లేదా మరే ఇతర మీడియా వారైనా) తెలుసుకోవాల్సింది లేదా తెలియజెప్పాల్సింది ఏంటంటే రాజధాని తరలిపోవడం లేదు. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అమలుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయిన తరువాత కూడా అమరావతి శాసనరాజధానిగా కొనసాగబోతోంది. ఆయితే పూర్తిస్థాయి రాజధానిగా ఉండకపోవడం అన్నది ఖచ్చితంగా కొంత ప్రతికూలాంశమే. అయితే అది ఎవరికి నష్టం అన్నది గమనించాలి. రైతులకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరించకపోవచ్చు. మరీ వారు ఆశపడుతున్నట్టు ఎకరా నాలుగైదు కోట్ల స్థాయికి కాకపోయినా, నష్టపరిహారం లేదా పొలం వెనక్కి ఇవ్వడం వంటివి జరగవచ్చు. ప్రధానంగా నష్టపోయేది ఎవరంటే అక్కడ భూములు, ప్లాట్స్ కొన్నవారు అన్నది ఇవాళ్టి ఈనాడు కథనం (మధ్యతరగతి ఆశలపై పిడుగు) ద్వారా అర్...

... పవర్ స్టార్ - పార్ట్ 1 (నో పాలిటిక్స్)

వంశీ కలుగోట్ల // ... పవర్ స్టార్ -  పార్ట్ 1 (నో పాలిటిక్స్) // ****************************** ********************             1996 లో నేను కర్నూలులో ఇంటర్మీడియేట్ చదువుతున్నాను, నేను హాస్టల్ లో ఉండేవాడిని. మా కాలేజీ సిటీకి దూరంగా, నందికొట్కూరు రోడ్ లో ఉండేది. ప్రతి ఆదివారం హాస్టల్ లో ఉండే అందరినీ కాలేజీ బస్సులు సిటీ సెంటర్ లో డ్రాప్ చేసి, మళ్ళీ సాయంకాలం హాస్టల్ కి తీసుకెళ్ళేవి. నాకు బాగా గుర్తు ... అప్పట్లో కొన్ని పోస్టర్స్ వచ్చాయి 'ఎవరీ అబ్బాయి' అంటూ. ఈవీవీ సత్యనారాయణ సినిమా అని తెలుసు, కానీ హీరో ఎవరో అర్థం కాలేదు. కొన్నాళ్ళకు తెలిసింది ఆ సినిమాలో హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడు కళ్యాణ్ బాబు అని. అప్పటికి దాదాపు రెండు మూడేళ్ళ నుండి చిరంజీవికి సరైన హిట్ పడక, 1996 లో అప్పటివరకూ చిరంజీవి సినిమా లేక చిరంజీవి అభిమానులు డీలాగా ఉన్న సమయం అది. ఆ సమయంలో చిరంజీవి తమ్ముడి సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే కదా. సినిమా రిలీజ్ అయింది, ఫుల్ హంగామా. సినిమా చూశాక మొదట అనుకున్నది డాన్సుల్లో చిరంజీవి పేరు సెడగొట్టేట్టు ఉన్నాడు కదరా అని, ఇక నటన గురించి అంట...

... కరోనా గురించి కొన్నిమాటలు

వంశీ కలుగోట్ల // ... కరోనా గురించి కొన్నిమాటలు // *******************************************             ఇపుడు కరోనా గురించే వార్తలన్నీ, కరోనా లేని వార్తలు లేవు. కాబట్టి కాస్త కరోనా గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అసలే శ్రీశ్రీ గారు చెప్పిన 'అగ్గిపుల్లా, సబ్బుబిళ్ళా ... కాదేదీ కవితకనర్హం' అన్న మాటలను ఆదర్శంగా తీసుకుంటాం మనమంతా. అలాంటిది నాలుగు మాటలు చెప్పుకోవడానికి కరోనా లాంటి టాపిక్ ను వదలడమెందుకు? కమాన్ గుస గుస ...             కరోనాకు మందు లేదు అని చెబుతున్నది అబద్ద్ధం అని నా అభిప్రాయం. ఎందుకంటే కరోనా వచ్చిన వారందరూ మరణించటం లేదు. కాకపొతే కరోనా వైరస్ సోకినా తరువాత ప్రారంభ దశలో కాకుండా తీవ్రమైన దశలో కనుగొంటే కోలుకోవడం అన్నది ప్రధానంగా ఆ వ్యక్తి యొక్క అంతర్గత రోగనిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అదే ప్రారంభ దశలో కనుగొనగలిగితే కొన్ని మందులతో, బలవర్ధక ఆహారం, మరికొన్ని వైద్యులు సూచించిన విషయాలు పాటించడం వంటి వాటిద్వారా కోలుకునేలా చేయవచ్చు అన్నది ఇప్పటిదాకా జరుగుతోంది అని నా అభిప్రాయం. ముదిరిపోయాక ఏ మందులూ ఏమీ చేయలేవు. క...

... వైఎస్సార్

వంశీ కలుగోట్ల // ... వైఎస్సార్ // ***************************             కాంగ్రెస్ చరిత్రలో వైఎస్సార్ ది ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పవచ్చు. మొదటినుండి కాంగ్రెస్ లో రెండే మార్గాలు - అధిష్టానంతో సర్దుకుపోవడం లేదా అధిష్టానానికి ఎదురు తిరిగి బయటకు పోవడం. ఒకానొక ఉత్తమ ఉదాహరణ సుభాష్ చంద్రబోస్; మరొక ఉదాహరణ ప్రకాశం పంతులు, రాజాజీ వంటివారు. బోస్ ఎదురు తిరిగి బయటకు వెళ్ళగా; ప్రకాశం పంతులు, రాజాజీ వంటివారు సర్దుకుపోయారు. గాంధీ మరియు నెహ్రు ఆధిపత్యం అంగీకరించకపోతే బయటకు పోవలసిందే. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఆ పార్టీలో మరొక నాయకుడు స్థానికంగా కానీ, జాతీయంగా కానీ వ్యక్తిగత ఇమేజ్ తో బలపడకూడదు అనేది ఒక బేసిక్ ప్రిన్సిపల్ - అంటే అది వారి నియోజకవర్గస్ధాయి వరకూ అయితే పర్వాలేదు. అంతకుమించితే 'కట్' చేయబడతారు. గాంధీ, నెహ్రు కాలం నుండి నేటి సోనియా,  రాహుల్ వరకూ ఇదే తీరు. పార్టీలో ఉండి, పార్టీ తీరుకు భిన్నంగా ఎదగడం, కాంగ్రెస్ చరిత్రలో గాంధీ - నెహ్రు కుటుంబాలవారు మినహాయించి మరొకరు పార్టీకి మించి వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడం అన్నది జరగలేదు - నాకు తెలిసినంతవరకూ దానికి ఏకైక...

... జింక మీద జాలి కాదు

వంశీ కలుగోట్ల // ... జింక మీద జాలి కాదు // ****************************** ********             పంజాగుట్ట స్మశానవాటికలో కరోనా మృతుల శవాలను కుక్కలు పీక్కుతింటున్నాయి అన్న వార్త చూసినపుడు చాలా బాధగా అనిపించింది. అందులో నిజానికి మీడియా అతి కూడా ఉందేమో. అక్కడ గుట్టలుగా శవాలు పడేసి, ఎవరూ పట్టించుకోకుండా వదిలేసి, కుక్కలపాలు కావడం జరగలేదు. బహుశా అది కేవలం ఒక ఘటన మాత్రమే కావచ్చు. ఆ పోస్ట్ చూడగానే మొదట చాలా బాధ కలిగింది, ఇంతటి నిర్వహణా లోపమా అని కోపమూ వచ్చింది. అదే సమయంలో నిద్రాణంగా ఉండిన బాధపడిన ఘటన గుర్తొచ్చింది - అదే తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు 'హైదరాబాద్ ను కర్నూలు, గుంటూరుల లాగా కానివ్వం' అని వెటకారంగా మాట్లాడిన మాటలు. ఆయన ఆ మాట అన్న సమయంలో, అక్కడున్న ఎవరూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకురాలేదు - ఆయన అన్న ఆ మాటలు అసందర్భమే కాక, బాధించాయి. అందుకే '...తలకాయ యాడ బెట్టుకోవాల్నో అర్థమవుతోందా రాజేంద్రా' అన్న వైఎస్ గారి వ్యాఖ్యలను ఉటంకించాను. ఈ పోస్ట్ ద్వారా కామెంట్స్ లోనూ, ఆఫ్ లైన్ లోనూ నాకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముందుగా ఆ పోస్ట్ లో పెట్టిన పిక...

... పోరాడమని చెప్పండి

వంశీ కలుగోట్ల // ... పోరాడమని చెప్పండి // ****************************** ******* 'ఆ గొంతు, ఆకారం - వీడేంటి, హీరో ఏంటి?' అని చీత్కారాలెదుర్కొన్న వ్యక్తి ఇవాళ ఒక స్ఫూర్తివంతమైన నటుడు, తిరుగులేని మెగాస్టార్ అయ్యాడు. ఒక దిగ్గజంగా వెలుగుతున్న అమితాబ్ బచ్చన్ అయ్యాడు. అతడిప్పుడు భారతీయ సినీ రంగానికి భీష్ముడు లాంటి వ్యక్తి.  'ఈ ... మొఖపోడికి హీరో అవకాశం ఇవ్వాలంట, అది కూడా నా సినిమాలో' అని ఛీత్కారం చేసిన దర్శకాగ్రేసరుడే, తన కాల్షీట్స్ కోసం వారం రోజులు తిరిగే స్థాయికి ఎదిగాడు చిరంజీవి. తెలుగు సినిమా గతిని మార్చిన మెగాస్టార్ గా ఇంకా వెలుగొందుతున్నాడు.  అనిల్ కపూర్, షారుఖ్, , ఆమీర్, సల్మాన్, హృతిక్ లాంటివారందరూ అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కోలేదా? రజనీకాంత్, అర్జున్, అజిత్, విక్రమ్, రవితేజ, నాని, వీడి కొండా లాంటివారు అవమానాలు, తిరస్కారాలు ఎదుర్కోలేదా? (ఇక్కడ పేర్లు ప్రస్తావించబడని అనేకమంది కూడా) బంధుప్రీతి (నెపోటిజం) ఖచ్చితంగా ఉంది, ఉంటుంది కూడా అది బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా? మరింకో వుడ్అయినా. మనకు పెద్దగా పరిచయం లేదు కానీ హాలీవుడ్ లో కూడా ఎంతోకొంత స్థాయిలో ఖచ్చితంగా ఉంటుంది....